News August 23, 2025
యూరియా సరఫరా సజావుగా జరగాలి: కలెక్టర్

దుర్శేడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం సందర్శించారు. రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆమె ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. యూరియా అక్రమంగా నిల్వ ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం సంఘం ఆవరణలో ఆమె మొక్కలు నాటారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, సహకార సంఘం అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Similar News
News August 23, 2025
KNR:ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని, ఆ దిశగా లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ సహకరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ పథకం అమలుపై కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో హౌసింగ్, ఆర్ అండ్ బీ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. పైలెట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నూరు శాతం పూర్తి చేయాలని, గృహప్రవేశాలకు సిద్ధం చేసేలా చూడాలని కలెక్టర్ సూచించారు.
News August 23, 2025
KNR: ‘శాంతియుతంగా పండుగ జరుపుకోవాలి’

KNR పోలీస్ కమిషనరేట్లో మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా నగరంలోని మర్కజీ మిలాద్ కమిటీ, సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ, మదరసా అన్వార్ ఉల్ ఉలూమ్ కమిటీల పెద్దలతో పోలీసు కమిషనర్ గౌష్ ఆలం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబి పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని కమిటీ సభ్యులను కోరారు. పండుగలకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
News August 23, 2025
ఎమ్మెల్యే కవ్వంపల్లిని పరామర్శించిన మంత్రి వివేక్

మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి రాజేశం ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. దీంతో శనివారం ఆయన చిత్రపటానికి కార్మిక & బొగ్గుగనుల శాఖా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను, మృతుడు రాజేశం కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపర్చారు.