News August 23, 2025

NLG: ఉత్సవాలను ప్రశాంతతతో జరుపుకోవాలి: ఎస్పీ

image

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ప్రశాంతతతో, శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపు కోవాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే అధిక శబ్దం కలిగించే లౌడ్ స్పీకర్లు, డీజేలకు అనుమతి లేదని శనివారం పేర్కొన్నారు. వివాదాస్పద పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. మండపాల వద్ద మద్యం సేవించరాదని పేర్కొన్నారు.

Similar News

News March 27, 2026

మిర్యాలగూడ పార్లమెంటు స్థానంపై చర్చ..!

image

నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో మిర్యాలగూడ పార్లమెంటు స్థానాన్ని పునరుద్ధరించాలని చర్చ మొదలైంది. 2008లో ఈ స్థానాన్ని నల్గొండలో కలిపిన సంగతి తెలిసిందే. 1962 నుంచి 2004 వరకు ఈ నియోజకవర్గం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం పునర్విభజనలో భాగంగా మిర్యాలగూడను తిరిగి లోక్‌సభ స్థానంగా మార్చాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

News March 27, 2026

NLG: వేసవిలో విద్యుత్ కష్టాలకు చెక్.. ‘పవర్’ ఫుల్ ప్లాన్

image

వేసవిలో ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా నల్గొండ జిల్లా అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. సాధారణంగా రోజుకు 15 మిలియన్ యూనిట్ల వాడకం ఉండగా, ఏప్రిల్, మే నెలల్లో ఇది 22 మిలియన్ యూనిట్లకు చేరుతుందని అంచనా. లోడ్ తట్టుకునేందుకు సబ్‌స్టేషన్లలో అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ ప్రాంతాల్లో సామర్థ్యాన్ని పెంచారు.

News March 27, 2026

NLG: రేపు జాతీయ లోక్ అదాలత్…

image

లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో పెండింగ్, ప్రీలిటిగేషన్ కేసుల పరిష్కారానికి శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నల్గొండ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ (పూర్తి అదనపు బాధ్యతలు) పురుషోత్తంరావు ఒక ప్రకటనలో తెలిపారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.