News April 2, 2024
గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

AP: గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఆర్ఎస్ సెట్-2024, ఏపీఆర్జేసీ, డీసీ సెట్లకు దరఖాస్తు గడువును ఈ నెల 5వ తేదీ వరకు పొడిగించారు. 2024- 25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు 5 నుంచి 8 తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు https://aprs.apcfss.in వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.
Similar News
News January 25, 2026
అభిమానికి గోల్డ్ చైన్ ఇచ్చిన రజినీకాంత్

సూపర్స్టార్ రజినీకాంత్ తన అభిమానికి బంగారు గొలుసు ఇచ్చారు. మధురైలో పేదల కోసం కేవలం రూ.5కే పరోటా విక్రయిస్తున్న ‘రజినీ శేఖర్’ సేవలను ప్రశంసించారు. శేఖర్ కుటుంబాన్ని చెన్నైలోని తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రజినీకాంత్ ‘జైలర్ 2’ మూవీతో బిజీగా ఉండగా, ఏప్రిల్ నుంచి సిబి చక్రవర్తి దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
News January 25, 2026
అసెంబ్లీ గందరగోళంపై రాష్ట్రపతికి నివేదిక

కర్ణాటక అసెంబ్లీలో జరిగిన <<18923034>>గందరగోళం<<>>పై ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ రాష్ట్రపతి ముర్ముకు నివేదిక సమర్పించారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అంశాలు ఉన్న కారణంగా ప్రసంగ ముసాయిదాలోని 2 నుంచి 11 పేరాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించానని తెలిపారు. అదే విధంగా ప్రసంగం అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని నివేదికలో పేర్కొన్నారు.
News January 25, 2026
ముద్దు సీన్లకు భయపడే ఛాన్స్లు వదులుకున్నా: సోనమ్ బజ్వా

ముద్దు సన్నివేశాల్లో నటించాలనే భయంతోనే బాలీవుడ్ అవకాశాలు వదులుకున్నానని నటి సోనమ్ బజ్వా అన్నారు. ‘‘ముద్దు సీన్లలో నటిస్తే పంజాబ్లో ఇమేజ్ ఏమవుతుందోనని భయపడ్డాను. నా ఫ్యామిలీ ఎలా అర్థం చేసుకుంటుందో, అభిమానులు ఏమనుకుంటారో అనుకున్నాను. పేరెంట్స్తో డిస్కస్ చేయడానికి సిగ్గుపడ్డాను. చివరికి అడిగితే ‘సినిమా కోసమేగా. తప్పేముంది’ అనడంతో షాకయ్యాను’’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.


