News August 23, 2025
NTR: గణేశ్ ఉత్సవాలకు మండపం పెడుతున్నారా.. ఇది మీ కోసమే

ఎన్టీఆర్ జిల్లాలో గణేశ్ ఉత్సవాలకు మండపాలు ఏర్పాటు చేసేవారు సింగిల్ విండో ద్వారా సులభంగా అనుమతి పొందవచ్చని సీపీ రాజశేఖరబాబు తెలిపారు. https://ganeshutsav.net/ వెబ్సైట్లో మండపం నిర్వహించేవారు తమ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఉత్సవాల అనంతరం నిమజ్జనం తేదీ, వాహన వివరాలు కూడా పోర్టల్లో నమోదు చేయాలని సీపీ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Similar News
News April 2, 2026
పెదకొండేపూడి గోశాల వెనుక కొండపై పులి విశ్రాంతి: రేంజర్

సీతానగరం మండలం పెదకొండేపూడిలో గోశాల వెనుక నేలకోట కొండపై గురువారం ఉదయం పులి ఉన్నట్లు ట్రాకింగ్ ద్వారా గుర్తించినట్లు జిల్లా అటవీశాఖ రేంజర్ దావీదురాజు తెలిపారు. గోకవరం, ఇందుకూరు, రాజమహేంద్రవరం నుంచి మూడు బృందాలతో ప్రస్తుతం పెదకొండేపూడిలో వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. రేంజర్ కొండలరావు మాట్లాడుతూ.. పగటి సమయంలో పులి పూర్తి విశ్రాంతి తీసుకుంటుందని ఈరోజు రాత్రికి దాని కదలికలు తెలుస్తుందన్నారు.
News April 2, 2026
కొవ్వూరు: గోదావరి ఒడ్డున మహిళ మృతదేహం లభ్యం

కొవ్వూరు సమీప గోదావరి ఒడ్డున కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన చెరుకూరి సూర్యచక్ర(30) మృతదేహం లభ్యమైంది. గత నెల 21న ఇద్దరు కుమార్తెలతో కలిసి గౌరీపట్టణం మేరీ మాత ఉత్సవాలకు వచ్చిన ఈమె, తిరిగి ఇంటికి చేరలేదు. బుధవారం మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే, ఆమెతో ఉన్న ఇద్దరు పిల్లల ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
News April 2, 2026
చిత్తూరు: గ్రీన్ ఫీల్డ్ హైవేపైకి వాహనాల అనుమతి

చిత్తూరు-తచ్చూరు గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు దాదాపు పూర్తయ్యాయి. వాహనాల ట్రయల్ రన్లో భాగంగా పూర్తిస్థాయిలో అనుమతినిచ్చారు. దీంతో పలు వాహనాలు ప్రయాణించాయి. చిత్తూరు నుంచి తమిళనాడులోని ఊత్తుకోట వరకు 95 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఈ మొత్తం దూరాన్ని ఒకటిన్నర గంటలోనే చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.


