News August 23, 2025

రేపు వెంకయ్య స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సోమిరెడ్డి

image

గొలగమూడిలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమం భాగంగా ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించాలని కార్యాలయ సిబ్బంది తెలిపారు.

Similar News

News August 24, 2025

కీలక మలుపు తిరిగిన కరేడు రైతు ఉద్యమం

image

రాష్ట్రంలో సంచలనం రేపిన కరేడు రైతు ఉద్యమం ఆసక్తికర మలుపు తిరిగింది. ఉలవపాడు(M) కరేడులో ఇండోసోల్ పరిశ్రమ కోసం ఇచ్చిన 4,800 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కరేడు, ఉలవపాడు, కందుకూరు తదితర ప్రాంతాలలోని 10 దేవాలయాలకు చెందిన 104.21 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్దంగా నోటిఫికేషన్‌లో చేర్చారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో హైకోర్టు విచారణ చేపట్టింది.

News August 23, 2025

సజావుగా పోలీస్ కానిస్టేబుల్స్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ : SP

image

కానిస్టేబుల్ ఉద్యోగానికి జరిగిన వివిధ పరీక్షలలో ఉత్తీర్ణత పొంది ఉద్యోగాన్ని సాధించిన అభ్యర్థులందరికీ ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ జరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు భవిష్యత్తులో క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజాసేవ చేయాలని SP కృష్ణ కాంత్ సూచించారు.

News August 23, 2025

తొలి వారం 7.6 లక్షల మంది ‘స్త్రీశక్తి’ ప్రయాణాలు : RM షమీమ్

image

జిల్లాలో స్త్రీశక్తి పథకం ఆరంభించాక తొలి వారం 7,64,311 మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారని జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షమీమ్ తెలిపారు. శనివారం ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ.. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభం కాగా, 22 వ తేదీ వరకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ వంటి మూడు రకాల బస్‌లలో మొత్తం 14,88,537 మంది ప్రయాణించారన్నారు.