News August 23, 2025
NZB: ఆ మెసేజ్ల పట్ల వాహనదారులు తస్మాత్ జాగ్రత్త

సైబర్ నేరగాళ్లు మరో కొత్త మోసాలకు తెరలేపారు. వాట్సాప్లో మీ ద్విచక్ర వాహనానికి ఈ-చలాన్ పడిందని మెసేజ్లు పంపి Apk లింక్ పంపుతున్నారు. గాభరా పడిన ప్రజలు ఆ లింక్ ఓపెన్ చేయగా వారి ఫోన్ హ్యాక్ అయి వారి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు ఆటోమేటిక్గా డెబిట్ అవుతున్నాయి. ప్రజలెవరూ అలాంటి Apk లింక్లు ఓపెన్ చేయొద్దని సైబర్ క్రైం వింగ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News March 22, 2026
NZB: నేడు ప్రపంచ జల దినోత్సవం.. మీరేం చేయాలంటే?

“నీరు లేనిదే జీవం లేదు.. నీటిని పొదుపుగా వాడటం మనందరి బాధ్యత” అనే నినాదంతో నేడు ప్రపంచ జల దినోత్సవం నిర్వహించనున్నారు. కురుస్తున్న వర్షాలు, ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ వంటి పథకాల వల్ల జిల్లాలో భూగర్భ జలాలు గతంలో కంటే కొంత మెరుగయ్యాయి. అయినప్పటికీ “ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడడంతో పాటు తమ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతను నిర్మించుకోవడం, బావులను, చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’.
News March 21, 2026
ఏర్గట్ల: చిట్టి చేతులు..చక్కని కవితలు

నేటి తరం విద్యార్థులు సిలబస్ అనే చట్రం నుంచి బయటకు రాలేకపోతున్నారు. కానీ తడపాకల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో చదవడం, రాయడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. కలాలు పట్టి తేలికపాటి పదాలతో అందరికీ అర్థమయ్యేలా కథలు, కవితలు రాసేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తాచాటి పురస్కారాలు, ప్రశంసలు పొందుతున్నారు. ఇప్పటి వరకు 15కి పైగా సంపుటులు ఆవిష్కరించారు.
# నేడు ప్రపంచ కవితా దినోత్సవం
News March 21, 2026
నిజామాబాద్: కొండెక్కిన ధరలు

నిజామాబాద్ జిల్లాలో చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎండల తీవ్రతతో కోళ్ల ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడంతో ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో స్కిన్లెస్ చికెన్ కిలో రూ.325 పలుకుతుండగా, డ్రెస్డ్ చికెన్ రూ.286-290 మధ్య ఉంది. రంజాన్ పండుగను పురస్కరించుకుని గత నెలతో పోలిస్తే కిలోపై రూ.80 వరకు పెరగడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.


