News August 23, 2025
కొత్త బిజినెస్లోకి DREAM SPORTS!

ఆన్లైన్ గేమింగ్ చట్టంతో డ్రీమ్11 తమ ఆర్థిక లావాదేవీలను ఆపేసింది. ఈ నేపథ్యంలో దీని పేరెంట్ కంపెనీ డ్రీమ్ స్పోర్ట్స్.. ‘డ్రీమ్ మనీ’ పేరిట కొత్త యాప్ను టెస్ట్ చేస్తున్నట్లు మనీ కంట్రోల్ తెలిపింది. ఇందులో రోజుకు రూ.10 నుంచే డిజిటల్ గోల్డ్పై పెట్టుబడి పెట్టొచ్చు. ఇందుకోసం డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్ Augmontతో చేతులు కలిపింది. అలాగే బ్యాంక్ ఖాతా లేకుండానే కనీసం రూ.1000తో FD చేసే అవకాశం కల్పించనుంది.
Similar News
News August 24, 2025
కూలీ, వార్-2 కలెక్షన్లు ఎంతంటే?

రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కూలీ’ విడుదలైన 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. 74% రికవరీ చేసిందని, మరో రూ.80 కోట్లు వసూలు చేయాల్సి ఉందన్నాయి. మరోవైపు NTR, హృతిక్ నటించిన ‘వార్-2’ వరల్డ్ వైడ్గా రూ.314 కోట్లకు పైగా వసూలు చేసినట్లు వెల్లడించాయి. ఈ రెండు చిత్రాలకు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.
News August 24, 2025
100 దేశాలకు భారత్ నుంచి EVల ఎగుమతి: మోదీ

100 దేశాలకు EVలు ఎగుమతి చేసిన అరుదైన మైలురాయిని భారత్ అందుకోనుందని వరల్డ్ లీడర్ ఫోరమ్లో PM మోదీ అన్నారు. 2014 వరకు ఏటా ఆటోమొబైల్ ఎగుమతుల విలువ రూ.50వేల కోట్లు ఉంటే ప్రస్తుతం రూ.1.2 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. భారత్ ఇప్పుడు మెట్రో కోచ్లు, రైల్ కోచ్లు, లోకోమోటివ్స్ ఎగుమతిని ప్రారంభించిందని పేర్కొన్నారు. 100దేశాలకు ఎగుమతుల మైలురాయికి గుర్తుగా ఎల్లుండి ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
News August 24, 2025
రాహుల్కు, కాంగ్రెస్కు బిహార్లో గౌరవం లేదు: ప్రశాంత్ కిషోర్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి, ఆయన పార్టీకి బిహార్లో ఎలాంటి గౌరవం లేదని జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ RJDని అనుసరిస్తుందని విమర్శించారు. బిహార్లోని ప్రధాన సమస్యలైన వలస, అవినీతి, విద్య వంటి అంశాల గురించి ప్రస్తావించకుండా రాహుల్, PM మోదీ ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. దీంతో ప్రజలు తన పార్టీవైపే చూస్తున్నారని చెప్పారు.