News August 23, 2025
కేసుల పరిష్కారానికి కృషి చేయాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి

జాతీయ లోక్ అదాలత్లో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేశ్ బాబు సూచించారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు వచ్చే నెల 13న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్తో నిర్వహించడం జరుగుతుందన్నారు. కాగా జిల్లా పరిధిలోని కేసుల పరిష్కారానికి పోలీసులకు జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో పలు సూచనలను అందజేశారు.
Similar News
News August 24, 2025
బీసీ బిల్లును కావాలనే ఆలస్యం చేస్తున్నారు: భట్టి

TG: BCల రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ నుంచి రాష్ట్రపతి వద్దకు వెళ్లిందని, అక్కడ కావాలనే ఆలస్యం జరుగుతోందని Dy.CM భట్టి విక్రమార్క ఆరోపించారు. BCలకు న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఏర్పాటైన కమిటీ వివిధ అంశాలను పరిశీలించి 28వ తేదీ లోపు నివేదిక ఇస్తుందని చెప్పారు. మరోవైపు, ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయానికి సహకరించాలని రాజకీయ పార్టీలను కోరారు.
News August 24, 2025
టీచర్లుగా ఎంపికైన భార్యాభర్తలు

మహానంది మండలం గోపవరానికి చెందిన పగడాల శ్రీనివాసులు, లక్ష్మీకళ దంపతులు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. శ్రీనివాసులు అల్లీనగరంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తునే గాజులపల్లెలో ఇన్ఛార్జ్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిపై మక్కువతో డీఎస్సీ పరీక్షలు రాశారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో దంపతులిద్దరూ స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ డైరెక్టర్లు)గా ఉద్యోగాలు సాధించారు.
News August 24, 2025
ఆగస్టు 24: చరిత్రలో ఈ రోజు

1908: స్వాతంత్ర్యోద్యమకారుడు రాజ్ గురు జననం
1923: భారతీయ పరిశోధకుడు హోమీ సేత్నా జననం
1927: అలనాటి నటి అంజలీదేవి జననం
1928: సాహితీవేత్త దాశరథి రంగాచార్య జననం
1970: సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి జననం
1989: గాయని గీతా మాధురి జననం
2019: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మరణం
* ఉక్రెయిన్ స్వాతంత్ర దినోత్సవం