News August 23, 2025

HYD: ఈనెల 25న సత్యాగ్రహ దీక్ష: తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం

image

ఆగస్టు 25న MP, BC సంఘం జాతీయ అధ్యక్షుడు R.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో జరగబోయే సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని తెలంగాణ BC విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి సిరిపురం రవికుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. 42% BC రిజర్వేషన్లను అమలు చేయాలని, రిజర్వేషన్లపై ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. డిక్లరేషన్‌ను అమలు చేయాలని, లేకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

Similar News

News September 12, 2025

HYD: మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇన్‌ఛార్జి బాధ్యుడు: రంగనాథ్

image

మ్యాన్ హోల్‌లో చిన్నారి పడిపోయిన ఘటనపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. మ్యాన్‌హోల్ ఘటనపై ఉదయం ప్రాథమిక విచారణ జరిగిందని ఇందులో హైడ్రాదే పూర్తి బాధ్యత అన్నారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇన్‌ఛార్జి ఈ ఘటనకు బాధ్యుడని, మ్యాన్‌హోల్ మూత మూసేందుకు అవసరమైన చర్యలు తక్షణమే తీసుకున్నామన్నారు. బాధ్యులపైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News September 12, 2025

సికింద్రాబాద్: గాంధీలో సేవలు ఇకనైనా గాడిన పడేనా?

image

గాంధీ ఆస్పత్రి అంటేనే తెలుగు రాష్ట్రాల్లోని పేదలకు ఓ ధైర్యం.. అలాంటిది ఇటీవల ఇందులో సరైన సేవలందడం లేదని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనంతటికీ కారణం సూపరింటెండెంట్ డా.రాజకుమారి నిర్లక్ష్య వైఖరే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన ప్రభుత్వం ఆమె స్థానంలో అడిషనల్ DME డా.వాణి నూతన సూపరింటెండెంట్‌ను నియమించింది. ఇప్పుడైనా సేవలు మెరుగుపడతాయేమోనని నగర వాసులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

News September 12, 2025

KPHB: ఆత్మహత్యాయత్నం కేసులో గృహిణి రిమాండ్

image

KPHB 6వ ఫేజ్‌లో దంపతులు సూసైడ్ అటెంప్ట్ కేసు గత నెల 30న సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిలో భర్త రామకృష్ణారెడ్డి చనిపోగా భార్య రమ్యకృష్ణ చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. అప్పుల బాధ తాళలేక ఇద్దరు ఆత్మహత్యకు యత్నించడం, భర్తను కత్తితో గాయపరచగా రక్తస్రాపమై మృతి చెందాడు. భార్య చనిపోవడానికి ప్రయత్నించగా భయం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది.