News August 23, 2025

పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు: కాంగ్రెస్ నిర్ణయం

image

TG: స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు ఇవ్వాలని CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన PAC సమావేశంలో కాంగ్రెస్ నిర్ణయించింది. రిజర్వేషన్ల ఫైల్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ పరంగానే రిజర్వేషన్లు ఇవ్వాలని డిసైడ్ అయింది. SEP 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని HC గడువు విధించడంతో ప్రభుత్వం త్వరలోనే సర్పంచ్ ఎన్నికలపై ప్రకటన చేసే అవకాశముంది.

Similar News

News August 24, 2025

మధ్యాహ్నం నిద్రపోతున్నారా: చాణక్య నీతి

image

మధ్యాహ్నం నిద్ర మేలు కాదని చాణక్య నీతి చెబుతోంది. దీంతో ఇతరుల కంటే పని తక్కువగా చేయడమే కాకుండా సమయం వృథా అవుతుంది. డబ్బు నష్టపోయే అవకాశముంది. జబ్బు చేసిన వారు, గర్భిణులు, చిన్నపిల్లల తల్లులు మాత్రమే నిద్ర పోవాలని అంటోంది. మధ్యాహ్నం నిద్రతో జీర్ణ సమస్యలు వస్తాయని వైద్యులు కూడా చెబుతున్నారు. పవర్ న్యాప్(10-15 నిమిషాల నిద్ర)కు ఇది మినహాయింపు.
<<-se>>#chanakyaneeti<<>>

News August 24, 2025

యూఎస్ ఓపెన్.. ఎవరు సొంతం చేసుకుంటారో?

image

నేటి నుంచి యూఎస్ ఓపెన్(టెన్నిస్) మొదలు కానుంది. పురుషుల సింగిల్స్‌లో 25వ టైటిల్‌పై కన్నేసిన సీనియర్ ప్లేయర్ జకోవిచ్ వరుస పరాజయాలకు తెరదించుతారో చూడాలి. చివరి 3 టోర్నీల్లో సెమీస్‌లోనే జకో ఇంటిదారి పట్టారు. అటు యువ ప్లేయర్లు సిన్నర్, అల్కరాజ్ టైటిల్ ఫేవరెట్లుగా ఉన్నారు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో సబలెంకా, స్వైటెక్, కోకో గాఫ్ మధ్య పోరు నెలకొంది. వెటరన్ ప్లేయర్ వీనస్ విలియమ్స్ కూడా బరిలో ఉన్నారు.

News August 24, 2025

ఇవాళ సురవరం అంతిమయాత్ర..

image

TG: సీపీఐ సీనియర్ నేత <<17490970>>సురవరం<<>> సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర ఇవాళ HYDలో జరగనుంది. ఉదయం 9 గంటలకు ఆయన భౌతికకాయాన్ని హిమాయత్ నగర్‌లోని మఖ్ధూం భవన్‌(CPI ఆఫీసు)కు తరలించనున్నారు. ఉ.10-మ.3 గంటల వరకు ప్రజా సందర్శనకు ఉంచుతారు. CM రేవంత్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య, ఇతర నేతలు నివాళి అర్పించనున్నారు. అనంతరం అధికారిక లాంఛనాలతో ర్యాలీగా తీసుకెళ్లి గాంధీ మెడికల్ కాలేజీకి పరిశోధన కోసం భౌతికకాయాన్ని అప్పగించనున్నారు.