News August 23, 2025
సింగూర్ ఔట్ఫ్లో 9,902 క్యూసెక్కులు

సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి ఇవాళ సాయంత్రం వరకు 11,414 క్యూసెక్కులు వరద జలాలు వచ్చి చేరినట్లు నీటిపారుదల శాఖ డివిజన్ అధికారి నాగరాజు తెలిపారు. ఎగువ నుంచి వరద తగ్గడంతో తెరిచిన నాలుగు గేట్లు క్లోజ్ చేసి కేవలం ఒక్క గేటు ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. స్పిల్ వే, జెన్కో కరెంట్, మిషన్ భగీరథ, HMWS, నీటి ఆవిరి కలిపి మొత్తం 9,902 క్యూసెక్కులు ఔట్ఫ్లో కొనసాగుతుందన్నారు.
Similar News
News August 24, 2025
యూఎస్ ఓపెన్.. ఎవరు సొంతం చేసుకుంటారో?

నేటి నుంచి యూఎస్ ఓపెన్(టెన్నిస్) మొదలు కానుంది. పురుషుల సింగిల్స్లో 25వ టైటిల్పై కన్నేసిన సీనియర్ ప్లేయర్ జకోవిచ్ వరుస పరాజయాలకు తెరదించుతారో చూడాలి. చివరి 3 టోర్నీల్లో సెమీస్లోనే జకో ఇంటిదారి పట్టారు. అటు యువ ప్లేయర్లు సిన్నర్, అల్కరాజ్ టైటిల్ ఫేవరెట్లుగా ఉన్నారు. మరోవైపు మహిళల సింగిల్స్లో సబలెంకా, స్వైటెక్, కోకో గాఫ్ మధ్య పోరు నెలకొంది. వెటరన్ ప్లేయర్ వీనస్ విలియమ్స్ కూడా బరిలో ఉన్నారు.
News August 24, 2025
ఇవాళ సురవరం అంతిమయాత్ర..

TG: సీపీఐ సీనియర్ నేత <<17490970>>సురవరం<<>> సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర ఇవాళ HYDలో జరగనుంది. ఉదయం 9 గంటలకు ఆయన భౌతికకాయాన్ని హిమాయత్ నగర్లోని మఖ్ధూం భవన్(CPI ఆఫీసు)కు తరలించనున్నారు. ఉ.10-మ.3 గంటల వరకు ప్రజా సందర్శనకు ఉంచుతారు. CM రేవంత్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య, ఇతర నేతలు నివాళి అర్పించనున్నారు. అనంతరం అధికారిక లాంఛనాలతో ర్యాలీగా తీసుకెళ్లి గాంధీ మెడికల్ కాలేజీకి పరిశోధన కోసం భౌతికకాయాన్ని అప్పగించనున్నారు.
News August 24, 2025
జగదేవపూర్: డెంగీ లక్షణాలతో బాలుడి మృతి

డెంగీ లక్షణాలతో బాలుడు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన నాయిని మహేందర్ కుమారుడు నాయిని శ్రావణ్ కుమార్(13) డెంగీ లక్షణాలతో సికింద్రాబాద్ కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.