News August 24, 2025

మట్టి గణపతిని పూజించండి: కలెక్టర్ నాగలక్ష్మీ

image

పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ప్రతి ఒక్కరూ వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మీ పిలుపునిచ్చారు. దీని కోసం ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలను మాత్రమే పూజించాలని ఆమె సూచించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఆమె విడుదల చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఖాజావలి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Similar News

News August 24, 2025

గుంటూరులో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్రం నిధులు

image

గుంటూరు జిల్లాలో పర్యాటక రంగాన్ని ప్రోత్సాహించడానికి నిధులు మంజూరు చేయిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ మానస సరోవరం, ఉండవల్లి గుహలు వంటి వాటి అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. సూర్యఘర్ పథకం కింద నమోదైన లక్ష మందిలో కేవలం 3,600 మందికే పరికరాలు అమర్చారని, ఈ సమస్యలను పరిష్కరించి అందరికీ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు.

News August 24, 2025

గుంటూరులో కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

గుంటూరులో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ.180, చికెన్ విత్ స్కిన్ కేజీ రూ.160గా విక్రయాలు జరుగుతున్నాయి. అయితే ఈ ధరలు కొన్ని ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో చికెన్‌కి ఉన్న డిమాండ్‌ని బట్టి రూ. 20 నుంచి రూ. 30 వ్యత్యాసం ఉంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News August 23, 2025

గుంటూరు జిల్లా TODAY TOP NEWS

image

☞ గుంటూరులో అబ్బురపరుస్తున్న 99 అడుగుల మట్టి గణపతి.
☞ వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: SP.
☞ హత్యకు గురైన ఈ తీర్పు మా బిడ్డకు ఘనమైన నివాళి.
☞ మొదటి ఐదు ర్యాంకుల్లో జిల్లా మంత్రులు.
☞ తెనాలి: నిందితుడిని పట్టించిన సీసీ కెమెరా.
☞ రాష్ట్ర స్థాయి పోటీలకు మందడం విద్యార్థి.
☞ మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన పెమ్మసాని.