News August 24, 2025
పాలకోడేరు పీహెచ్సీనలో డీఎంహెచ్వో ఆకస్మిక తనిఖీలు

పాలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎం. గీతాబాయి ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్సీకి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పీహెచ్సీలో సాధారణ ప్రసవం అయిన మహిళను ఆసుపత్రిలో అందుతున్న సేవలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. డాక్టర్ గులాం రాజ్ కుమార్, స్వర్ణ నిరంజని ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు.
Similar News
News August 24, 2025
మూడు జిల్లాల్లోని ఏకైక పోస్టుకు వేణు మాధురి ఎంపిక

డీఎస్సీ-2025 పరీక్షలో తాడేపల్లిగూడెం చెందిన వేణు మాధురి మూడు జిల్లాల్లో ఉన్న ఏకైక ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుకు ఎంపిక కావడం విశేషం. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్ట్కు ఎంపిక కావడంతో పాటు జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు 11వ ర్యాంకు, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుకు 17వ ర్యాంకు సాధించారు. అంతేకాకుండా తల్లిదండ్రులు, సోదరి కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉండటం విశేషం.
News August 24, 2025
DSCలో జువ్వలపాలెం యువకుడికి నాలుగు కొలువులు

డీఎస్సీ ఫలితాల్లో కాళ్ల మండలం జువ్వలపాలెంకు చెందిన నడిమింటి రాము ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించాడు. ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఉమ్మడి జిల్లాలో 3వ ర్యాంక్, పీఈటీ విభాగంలో జిల్లాలో 3వ ర్యాంకు, ఎస్జీటీ విభాగంలో జిల్లా 84వ ర్యాంకు, జోనల్ స్థాయిలో పీడీ విభాగంలో 9వ ర్యాంకు సాధించాడు. గ్రామస్థులు ఈయనను అభినందించారు.
News August 24, 2025
క్షీర రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

పాలకొల్లులోని శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ దంపతులతో శనివారం దర్శించుకున్నారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసరావు హైకోర్టు జడ్జిను శాలువాతో సత్కరించి శ్రీ స్వామి వారి ఫోటో, తీర్థప్రసాదాలు అందజేశారు. పాలకొల్లు ప్రిన్సిపల్, సివిల్ జడ్జి షేక్ జియావుద్దీన్ పాల్గొన్నారు.