News August 24, 2025

ప్రశాంత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలు నిర్వహించుకోవాలి: ఎస్పీ

image

ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం వెల్లడించారు. గణేశ్ మండపాలకు, ఊరేగింపులకు సింగిల్ విండో విధానంలో నిర్వాహకులు అనుమతులు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద ఒకరిని కాపలా ఉంచాలని, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విపరీతమైన డీజే సౌండ్‌లను అనుమతించబోమని పేర్కొన్నారు.

Similar News

News August 24, 2025

కర్నూలు: ఒకే ఇంట్లో ముగ్గురికి టీచర్ ఉద్యోగాలు

image

కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామానికి చెందిన మన్సూర్ బాషా, జిలాని బేగం దంపతులకు చెందిన ముగ్గురు పిల్లలు డీఎస్పీ మెరిట్ లిస్టులో ఉద్యోగాలు సాధించారు. మొహమ్మద్ హనీఫ్ 79.67, హసీనా బాను 81.62, హరూన్ రషీద్ 84.11 మార్కులతో ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వీరిని గ్రామస్థులు అభినందించారు. తమ తల్లిదండ్రులు కష్టపడి చదివించారని, వారి కష్టం వృథా కాలేదని పిల్లలు పేర్కొన్నారు.

News August 23, 2025

లావణ్యకు కర్నూలు జిల్లా మొదటి ర్యాంక్

image

తుగ్గలి మండలం గుత్తి ఎర్రగుడి గ్రామానికి చెందిన బొల్లుం లావణ్య డీఎస్సీ మెరిట్ లిస్టులో 94.53202 మార్కులతో జిల్లా మొదటి ర్యాంక్ సాధించి టీచర్ ఉద్యోగం పొందారు. ఇష్టపడి చదివిన ఫలితమే ఈ విజయమని లావణ్య అన్నారు. మాజీ సర్పంచ్ వెంకటస్వామి, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, గ్రామస్థులు ఆమె ప్రతిభను కొనియాడి అభినందించారు.

News August 23, 2025

ప్రజల కోసం నిరంతరం శ్రమించిన యోధుడు టంగుటూరి: ఏఎస్పీ

image

స్వాతంత్ర్య సమరయోధుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రజల కోసం నిరంతరం శ్రమించిన యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని ఏఎస్పీ హుస్సేన్ పీరా అన్నారు. శనివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో టంగుటూరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఆయన నిస్వార్థ సేవలు కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.