News August 24, 2025

మెదక్: ‘ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషి’

image

మెదక్ ఆర్టీసీ డిపోలో శనివారం నిర్వహించిన ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమంలో డిపో మేనేజర్ సురేఖ ఫోన్ ద్వారా ప్రయాణికుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రయాణికులు చేసిన ఫిర్యాదులు, సూచనల మేరకు పని చేస్తామని తెలిపారు. ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాని, ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రయాణికులపై ఉందని ఆమె పేర్కొన్నారు.

Similar News

News August 24, 2025

MDK: స్వాతంత్ర్య సమర యోధుడు మృతి

image

స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న అల్లాదుర్గం ప్రాంతానికి చెందిన మజ్జిగ ఈశ్వరయ్య (96) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా ఇంట్లో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఏది ఏమైనా స్వాతంత్ర్య సంగ్రామ యోధుడిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు.

News August 24, 2025

నిజాంపేటలో అనుమానాస్పదంగా మహిళ సూసైడ్

image

నిజాంపేటలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో ఉరేసుకున్న ఘటన శనివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన బొంబాయి రాజవ్వ(50) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుందని గ్రామస్థులు తెలిపారు. అయితే ఆమె సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

News August 24, 2025

‘మెతుకు సీమలో కనుమరుగవుతున్న కళలు’

image

ఒకప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా పల్లెలు ప్రజల సంస్కృతి, జీవన విధానాన్ని ప్రతిబింబించిన జానపదాలు నేడు కనుమరుగైపోయాయి. చెక్కభజనలు, గంగిరెద్దులాటలు ఇప్పుడు చాలా అరుదయ్యాయి. సంక్రాంతి పండుగకు కనిపించే హరిదాసుల గేయాలు, ఒగ్గు కథలు, బొంగురోల ఆటలు కూడా కనుమరుగయ్యాయి. ఆధునిక పరిజ్ఞానం పెరిగిన కొలది పాత జ్ఞాపకాలు తొలగిపోతాయని కొందరూ చర్చించుకుంటున్నారు. దీనిపై మీ కామెంట్..!