News August 24, 2025
మట్టి గణపతిని పూజిద్దాం: కలెక్టర్ రాహుల్ రాజ్

‘మట్టి గణపతిని పూజిద్దాం.. ప్రకృతిని కాపాడదాం’ అని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్లో కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర కార్యాలయం రూపొందించిన గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలన్నారు. చెరువులు, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలని, పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు సూచించారు.
Similar News
News August 24, 2025
MDK: స్వాతంత్ర్య సమర యోధుడు మృతి

స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న అల్లాదుర్గం ప్రాంతానికి చెందిన మజ్జిగ ఈశ్వరయ్య (96) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా ఇంట్లో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఏది ఏమైనా స్వాతంత్ర్య సంగ్రామ యోధుడిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు.
News August 24, 2025
నిజాంపేటలో అనుమానాస్పదంగా మహిళ సూసైడ్

నిజాంపేటలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో ఉరేసుకున్న ఘటన శనివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన బొంబాయి రాజవ్వ(50) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుందని గ్రామస్థులు తెలిపారు. అయితే ఆమె సూసైడ్కు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
News August 24, 2025
‘మెతుకు సీమలో కనుమరుగవుతున్న కళలు’

ఒకప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా పల్లెలు ప్రజల సంస్కృతి, జీవన విధానాన్ని ప్రతిబింబించిన జానపదాలు నేడు కనుమరుగైపోయాయి. చెక్కభజనలు, గంగిరెద్దులాటలు ఇప్పుడు చాలా అరుదయ్యాయి. సంక్రాంతి పండుగకు కనిపించే హరిదాసుల గేయాలు, ఒగ్గు కథలు, బొంగురోల ఆటలు కూడా కనుమరుగయ్యాయి. ఆధునిక పరిజ్ఞానం పెరిగిన కొలది పాత జ్ఞాపకాలు తొలగిపోతాయని కొందరూ చర్చించుకుంటున్నారు. దీనిపై మీ కామెంట్..!