News August 24, 2025

జగదేవపూర్: డెంగీ లక్షణాలతో బాలుడి మృతి

image

డెంగీ లక్షణాలతో బాలుడు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన నాయిని మహేందర్ కుమారుడు నాయిని శ్రావణ్ కుమార్(13) డెంగీ లక్షణాలతో సికింద్రాబాద్ కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News August 24, 2025

రేపు వరంగల్ మార్కెట్ ప్రారంభం

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున:ప్రారంభం కానుంది. శనివారం అమావాస్య, ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News August 24, 2025

కర్నూలు: ఈనెల 29న సరిహద్దుల మార్పు కోసం విజ్ఞప్తుల స్వీకరణ

image

ఉమ్మడి జిల్లాకు సంబంధించి కర్నూలు సునయన ఆడిటోరియంలో 29న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మండల, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పు కోసం అభ్యర్థనలు స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. జిల్లా, మండల, గ్రామాల పేర్లు, అలాగే వాటి సరిహద్దులు మార్పు కోసం ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి ఈనెల 29న రాష్ట్ర మంత్రుల బృందం విజ్ఞప్తులను స్వీకరిస్తారని నంద్యాల కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు.

News August 24, 2025

సైక్లింగ్‌తో సంపూర్ణ ఆరోగ్యం: కడప SP

image

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కడప ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఊటుకూరు సర్కిల్ నుంచి మౌంట్ ఫోర్ట్ స్కూల్ వరకు ఆదివారం సైక్లింగ్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సైక్లింగ్ సహజ సిద్ధమైన వ్యాయామని చెప్పారు. అందరూ వ్యాయామంతో పాటు సైక్లింగ్ కూడా అలవాటు చేసుకోవాలని కోరారు.