News August 24, 2025
మైలవరం: 33 ఏళ్ల లీజుకు 1200 ఎకరాలు

కడప జిల్లా మైలవరం మండలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు 1200 ఎకరాలను లీజు ప్రాతిపదికను కేటాయిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దొడియంలో 1105.69 ఎకరాలు, వద్దిరాలలో 94.36 ఎకరాల ప్రభుత్వ భూములను 33 ఏళ్ల లీజుకు ఇచ్చింది. సోలార్ పరిశ్రమతో ఉద్యోగాలు వస్తాయని స్థానికులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
Similar News
News August 24, 2025
కడప: రేపటి నుంచి కౌన్సెలింగ్

కడప జిల్లాలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో సోమవారం నుంచి కౌన్సెలింగ్ జరుగుతుందని వీసీ డాక్టర్ విశ్వనాథ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. బీఎఫ్ఏ(ఫోర్ ఇయర్స్ డిగ్రీ) ఫైన్ ఆర్ట్స్ (యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, శిల్పం, బి. డెస్ ఇంటీరియర్ డిజైన్) కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
News August 24, 2025
సైక్లింగ్తో సంపూర్ణ ఆరోగ్యం: కడప SP

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కడప ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఊటుకూరు సర్కిల్ నుంచి మౌంట్ ఫోర్ట్ స్కూల్ వరకు ఆదివారం సైక్లింగ్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సైక్లింగ్ సహజ సిద్ధమైన వ్యాయామని చెప్పారు. అందరూ వ్యాయామంతో పాటు సైక్లింగ్ కూడా అలవాటు చేసుకోవాలని కోరారు.
News August 24, 2025
కడప: కానిస్టేబుల్ అభ్యర్థుల ట్రైనింగ్కు ఏర్పాట్లు

ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి త్వరలో శిక్షణ ప్రారంభించనున్నారు. కడప జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ ఇస్తారు. ఎస్పీ అశోక్ కుమార్ ఈ సెంటర్ను ఆదివారం తనిఖీ చేశారు. వసతి, తరగతి గదులు, మైదానం, అంతర్గత దారులు, పరికరాలను పరిశీలించారు. డీఎస్పీ అబ్దుల్ కరీంకు పలు సూచనలు చేశారు. శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు SP తెలిపారు.