News August 24, 2025

చవితి వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలి- కలెక్టర్

image

వినాయక చవితి సందర్భంగా మహబూబ్‌నగర్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం (IDOC) నందు పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ అధ్యక్షతన వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వినాయక చవితి వేడుకలు శాంతి, సామరస్య వాతావరణంలో నిర్వహించాలన్నారు. అందరూ మత సమన్వయం పాటించాలని సూచించారు.

Similar News

News August 24, 2025

MBNR: వినాయక చవితికి పటిష్ఠ భద్రత ఏర్పాట్లు

image

వినాయక చవితి వేడుకలను పురస్కరించుకొని మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ జానకి అన్నారు. వినాయక చవితి వేడుకలను పరిష్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వివాదాస్పద ప్రాంతాలలో దారికి అడ్డంగా మండపాలు ఏర్పాటు చేయకూడదన్నారు. అత్యవసర సేవలకు ఇబ్బందులు లేకుండా మండపాలు ఏర్పాటు చేయాలన్నారు.

News August 24, 2025

నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించండి- కలెక్టర్

image

నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమస్య నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు లేకుండా సక్రమంగా యూరియా సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

News August 23, 2025

MBNR: నేరచరిత్ర.. విచారణ చేపట్టండి- SP

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఎస్పీ డి.జానకి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన అన్ని కేసుల్లో సమగ్ర విచారణ చేపట్టి నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని ఎస్పీ సూచించారు. SC,ST యాక్ట్, ఉమెన్ అగైనెస్ట్ కేసులు, పోక్సో కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. DSP వెంకటేశ్వర్లు, CIలు అప్పయ్య, ఇజాజ్ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.