News August 24, 2025
పెనమలూరు: కీలిమంజారో విజయం.. కలెక్టర్ ప్రశంస

పెనమలూరు మండలానికి చెందిన అనుమోలు ప్రభాకరరావు ఇటీవల ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. శనివారం ఆయన కలెక్టర్ డి.కె. బాలాజీ కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనను అభినందించి, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ ఘట్టం ప్రేరణగా, యువతలో జైవిక, పర్యాటక అవగాహన పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Similar News
News August 25, 2025
కృష్ణా జిల్లాలో 5,17,825 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు

కృష్ణా జిల్లాలో కొత్త సాంకేతిక సదుపాయాలతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నేటి నుంచి ప్రారంభమవుతుంది. జిల్లాలోని 5,17,825 కుటుంబాలకు ఈ కార్డులను అందజేయనున్నారు. ఏటీఎమ్ కార్డు ఆకారంలో, క్యూఆర్ కోడ్తో రూపొందించిన ఈ కార్డులను గ్రామ సచివాలయాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని స్వయంగా కార్డులు అందజేస్తారు.
News August 25, 2025
విగ్రహాల ఏర్పాటు అనుమతులకు నేడు చివరి తేదీ: DSP

వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాల ఏర్పాటు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి సోమవారం చివరి రోజు అని మచిలీపట్నం డీఎస్పీ సి.హెచ్. రాజా ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్సవ నిర్వాహకులు సాయంత్రం 4 గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 450 విగ్రహాల ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
News August 25, 2025
మచిలీపట్నం: నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

మచిలీపట్నం కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.