News August 24, 2025
ఖమ్మం జిల్లాలో నాటుకోడి @400

ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు బ్రాయిలర్ చికెన్ ధర కిలో రూ.200 నుంచి రూ.220 వరకు పలుకుతుంది. స్కిన్ లెస్ చికెన్ రూ.210- 240, ఫారం మాంసం రూ.160-180, నాటుకోడి మాంసం రూ.350- 400కు పలుకుతోంది. దుకాణాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. మీ ప్రాంతంలో చికెన్ ధర ఎంత? కామెంట్ చేయండి.
Similar News
News August 24, 2025
కర్నూలు: ఒకే ఊరిలో 21 మందికి టీచర్ ఉద్యోగాలు

దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామానికి చెందిన 21 మంది డీఎస్పీ మెరిట్ లిస్టులో అర్హత సాధించారు. వీరిలో 17 మంది ఎస్జీటీ పోస్టులు, ఒకరు పీఈటీ, మరో ముగ్గురు స్కూల్ అసిస్టెంట్లు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వీరిని గ్రామస్థులు అభినందించారు. తమ తల్లిదండ్రులు కష్టపడి చదివించారని, వారి కష్టం వృథా కాలేదని వారు పేర్కొన్నారు.
News August 24, 2025
రైలులో తరలిస్తున్న మాదకద్రవ్యాలు స్వాధీనం

రైలులో అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను ఈగల్ సెల్ బాపట్ల టీం సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం బాపట్ల రైల్వే స్టేషన్ నుంచి పూరి-తిరుపతి ఎక్స్ప్రెస్లో ఈగల్ సెల్, రైల్వే పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. రైలులో అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశామన్నారు.
News August 24, 2025
సిరిసిల్ల: సోషల్ మీడియాపై పోలీసుల ప్రత్యేక నిఘా

సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల ఎస్పీ హెచ్చరించారు. అలాంటి పోస్టులు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయని, వాటిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిజానిజాలు తెలుసుకోకుండా ఎలాంటి మెసేజ్లను ఫార్వర్డ్ చేయవద్దని సూచించారు. జిల్లా పోలీస్ శాఖ సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పెట్టిందని ఆయన స్పష్టం చేశారు.