News April 2, 2024

జగిత్యాల: పురుగు మందు తాగి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

image

పురుగు మందు తాగి ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో చోటుచేసుకుంది. SI రామకృష్ణ వివరాల ప్రకారం.. మద్దులపల్లికి చెందిన వైష్ణవి(20) KNRలోని ఓ ప్రైవేట్ కళాశాలో డిగ్రీ చదువుతోంది. అయితే రెండు, మూడో సెమిస్టర్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి పురుగు మందు తాగింది. కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించింది.

Similar News

News April 22, 2025

కరీంనగర్: ఇంటర్‌ ఫస్ట్ ఇయర్‌లో 68.23 శాతం

image

ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 17,794 మందికి 12,141 మంది పాసయ్యారు. 68.23 శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది. సెకండ్ ఇయర్‌లో 15,187 మంది పరీక్షలు రాయగా 11,092 మంది పాసయ్యారు. 73.04 శాతం పర్సంటేజీ వచ్చింది.

News April 22, 2025

కొత్తపల్లి చెరువులో దొరికిన మృతదేహం వివరాలు లభ్యం

image

కరీంనగర్ కొత్తపల్లి హవేలీ చెరువులో యువకుడి మృతదేహం కనిపించిన విషయం తెలిసిందే. మృతి చెందిన వ్యక్తి భార్గవ్‌గా పోలీసులు గుర్తించారు. భార్గవ్ తల్లిదండ్రులు కొత్తపల్లికి చెందిన పబ్బోజు నాగరాజు యాదలక్ష్మి కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. ఈ క్రమంలో కొత్తపెళ్లి చెరువు వద్ద మృతదేహం లభించడంతో ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

News April 22, 2025

కరీంనగర్ జిల్లాలో ఎక్కడెక్కడ ఎంత ఎండ..

image

కరీంనగర్ జిల్లాలో ఎండ దంచికొడుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా మానకొండూర్ మండలంలో 43.5°C నమోదు కాగా, జమ్మికుంట 43.4, గంగాధర 43.2, తిమ్మాపూర్ 43.0, కరీంనగర్ 42.8, గన్నేరువరం 42.7, వీణవంక, కరీంనగర్ రూరల్ 42.6, రామడుగు, చిగురుమామిడి 42.5, హుజూరాబాద్, కొత్తపల్లి 42.4, ఇల్లందకుంట 42.3, శంకరపట్నం 42.2, చొప్పదండి 41.5, సైదాపూర్ 40.1°C గా నమోదైంది.

error: Content is protected !!