News August 24, 2025
PDPL: 26న విదేశీ ఉపాధి అవకాశాలపై అవగాహన

పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆగస్టు 26న విదేశాల్లో ఉపాధి అవకాశాలపై టామ్కామ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరుగుతుందని జిల్లా పరిశ్రమల అధికారి ఏ.కీర్తికాంత్ తెలిపారు. జపాన్, జర్మనీ, ఇజ్రాయెల్, ఫిజీ, గ్రీస్, పోర్చుగల్, యుఏఈ తదితర దేశాల్లో వివిధ ఉద్యోగావకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆసక్తిగల నిరుద్యోగులు హాజరై నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News August 25, 2025
కర్నూలు: DSC-2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాయిదా

రేపటి రోజు జరగాల్సిన DSC-2025 సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా వేయడం జరిగిందని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి వెరిఫికేషన్ తేదీనీ రాష్ట్ర విద్యాశాఖ అనుమతుల మేరకు ప్రకటించడం జరుగుతుందని వెల్లడించారు. డీఎస్సీ అభ్యర్థులు కీలక మార్పును గమనించి సహకరించాలని కోరారు.
News August 25, 2025
ధర్మారం: TGRS పూర్వ విద్యార్థికి కవితా పురస్కారం

ధర్మారం మండలం నంది మేడారం TGRS&JC పూర్వ విద్యార్థి (SSC 2010-11) చిందం రమేష్ ఆదివారం ఖమ్మంలో ‘వురిమల్ల పద్మజ స్మారక జాతీయ కవితా పురస్కారం’ అందుకున్నారు. ఆయన రాసిన ‘విషాద కావ్యం’ కవితకు గాను జాతీయస్థాయిలో ఈ పురస్కారం లభించింది. కాగా జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం గొడిసెలపేట గ్రామానికి చెందిన రమేష్ అదే మండలంలోని రాంనూరు గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.
News August 25, 2025
LIC ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా:MLA

భారతీయ జీవిత బీమా సంస్థ ఏజెంట్ల సమాఖ్య 1964 బ్రాంచ్–2, కరీంనగర్ శాఖ సర్వసభ్య సమావేశం ఆదివారం కరీంనగర్ లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MLA గంగుల కమలాకర్ హాజరై ఏజెంట్లతో సమావేశమయ్యారు. ఏజెంట్ల సమస్యలు, భవిష్యత్తు బీమా విధానాలు, ప్రజల్లో బీమా అవగాహన పెంపొందించడంలో ఏజెంట్లు పోషిస్తున్న కీలకపాత్రపై విశదీకరించారు. ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.