News August 24, 2025

వత్సవాయి: రాఖీ కట్టే విషయంలో వివాదం.. మహిళ సూసైడ్

image

సోదరులకు రాఖీ కట్టే విషయంలో చోటుచేసుకున్న వివాదం ఒక మహిళ జీవితాన్ని బలిగొంది. వత్సవాయికి చెందిన రేష్మ మక్కపేటలో నివసిస్తున్న తన సోదరులకు రాఖీ కట్టడానికి వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే, ఈ విషయంలో ఆమెకు భర్తతో గొడవ జరిగింది. ఈ గొడవతో క్షణికావేశంలో రేష్మ ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. సమాజంలో ఇలాంటి ఆత్మహత్యలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News August 25, 2025

కిషన్‌రెడ్డి వాస్తవాలను దాస్తున్నారు: తుమ్మల

image

TG: యూరియా పక్కదారి పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను మంత్రి తుమ్మల ఖండించారు. ‘11 ఏళ్లుగా లేని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందో మీకు తెలియదా? దిగుమతులు, దేశీయంగా సరిపడా ఉత్పత్తి లేక నెలకొన్న కొరతపై వాస్తవాలు దాస్తున్నారు. కేంద్రం TGకి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. కానీ 5.66 లక్షల మె.టన్నులే సరఫరా చేసింది’ అని స్పష్టం చేశారు.

News August 25, 2025

రేపు కాల్ లెటర్స్ విడుదల: డీఎస్సీ కన్వీనర్

image

AP: మెగా <<17508409>>డీఎస్సీ<<>> మెరిట్ అభ్యర్థులకు రేపు కాల్ లెటర్స్ అందుతాయని కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు విద్యాశాఖ అధికారులతో పాటు రెవెన్యూ విభాగానికి చెందిన ఉద్యోగితో కలిపి ముగ్గురు ఒక టీమ్‌గా ఉంటారని పేర్కొన్నారు. కాగా ధ్రువపత్రాల పరిశీలన ఎల్లుండి నుంచి మొదలు కానుంది.

News August 25, 2025

కాప్రా: స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం

image

మేడ్చల్ జిల్లా కాప్రా జీహెచ్ఎంసీ పరిధిలోని పద్మశాలి టౌన్‌షిప్‌లోని స్క్రాప్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపులో స్క్రాప్ తగలబడడంతో స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.