News August 24, 2025

రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

ఈ నెల 25న కలెక్టరేట్లో ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలు నుంచి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు. జిల్లా ప్రజలు 1100 నంబర్‌కు ఫోన్ చేసి తమ అర్జీ సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు.

Similar News

News August 25, 2025

అనంత: CM ప్రోగ్రాం ఏర్పాటు స్థల పరిశీలన

image

సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనకు సెప్టెంబర్ 3న రానున్నారు. ఈ నేపథ్యంలో గార్లదిన్నె మండలం కనుంపల్లి గ్రామం (అనంతపురం- హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన) స్థలాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ జగదీశ్ పరిశీలించారు. సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాటు పనులపై జిల్లా కలెక్టర్, ఎస్పీ చర్చించుకున్నారు.

News August 24, 2025

అనంత: CM ప్రోగ్రాం ఏర్పాటు స్థల పరిశీలన

image

సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనకు సెప్టెంబర్ 3న రానున్నారు. ఈ నేపథ్యంలో గార్లదిన్నె మండలం కనుంపల్లి గ్రామం (అనంతపురం- హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన) స్థలాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ జగదీశ్ పరిశీలించారు. సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాటు పనులపై జిల్లా కలెక్టర్, ఎస్పీ చర్చించుకున్నారు.

News August 24, 2025

జిల్లాలో ఫ్రీ బస్సును వినియోగించుకున్న 4,12,054 మంది మహిళలు

image

ఈనెల 15న ప్రారంభించిన స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఫ్రీ బస్సు ప్రయాణాన్ని అనంతపురం జిల్లాలో రికార్డు స్థాయిలో మహిళలు వినియోగించుకున్నారు. జిల్లాలో 303 బస్సులను స్త్రీ శక్తి పథకానికి అధికారులు వర్తింపజేశారు. 4,12,054 మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసి రూ.2,17,48, 677 మేర లబ్ధి పొందారు. స్త్రీలతో పాటు ఉచితాలకు వినియోగించిన బస్సుల్లో 75,5,354 మంది పురుషులూ ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు.