News August 24, 2025
ఏ పార్టీలో ఉన్నారో చెప్పేందుకు ధైర్యం లేదా?: KTR

TG: కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో రూ.2.80 లక్షల కోట్ల అప్పు చేస్తే రేవంత్ ప్రభుత్వం 20 నెలల్లోనే రూ.2.20 లక్షల కోట్ల అప్పు చేసిందని కేటీఆర్ అన్నారు. శేరిలింగంపల్లి BRS కేడర్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ‘ఎవరి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ పార్టీ మారారు? ఈ 20 నెలల్లో ఏం అభివృద్ధి చేశారు? ఏ పార్టీలో ఉన్నారో చెప్పేందుకు ధైర్యం లేదా? ఉప ఎన్నికలో గెలిచే దమ్ము ఉందా?’ అని ప్రశ్నించారు.
Similar News
News August 25, 2025
840 కొత్త బార్లకు 30 అప్లికేషన్లే!

AP: నూతన <<17448943>>బార్<<>> విధానానికి స్పందన కరువైంది. మొత్తం 840 బార్లకు నిన్నటి వరకు 30 అప్లికేషన్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. లైసెన్స్ దరఖాస్తులకు రేపటితో గడువు ముగియనుంది. దీంతో ఎక్సైజ్ అధికారుల్లో ఆందోళన నెలకొంది. బార్లకు ఇచ్చే మద్యంపై పన్ను, ఒక్కో బార్కు నాలుగు దరఖాస్తులు తప్పనిసరంటూ నిబంధనలు వ్యాపారుల నుంచి వ్యతిరేకతకు కారణమని సమాచారం. అయితే నిబంధనల్లో మార్పులు ఉండబోవని అధికారులు చెబుతున్నారు.
News August 25, 2025
అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ APలోని శ్రీకాకుళం, విజయనగరంలో రేపు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరిలో భారీ వర్షాలు, ఇతర చోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు TGలోని రంగారెడ్డి, HYD, మేడ్చల్, KMM, ఉమ్మడి ADB, వరంగల్, KNR, నల్గొండ, MBNRలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News August 25, 2025
ఇవాళ అందుబాటులోకి DSC కాల్ లెటర్లు

AP: DSCకి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన కాల్లెటర్లు నేటి నుంచి అభ్యర్థుల లాగిన్లో అందుబాటులో ఉంచనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. తొలుత ఈరోజు నుంచే వెరిఫికేషన్ చేపట్టాలని భావించినా, సాంకేతిక ఇబ్బందుల కారణంగా కాల్ లెటర్ల జారీ ఆలస్యంతో వాయిదా వేసింది. మొత్తం 16,347 పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన తర్వాత తుది జాబితా సిద్ధం చేసి పోస్టింగ్ ఇస్తారు.