News August 24, 2025

GHMC ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

image

గణేశ్ చతుర్థిని పురస్కరించుకుని మట్టి గణపతి విగ్రహాల పంపిణీ మొదలైంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ ఏడాది 2 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నారు. ఈ విగ్రహాలు ఆగస్టు 25, 26 తేదీలలో జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి. పర్యావరణ హితమైన గణేశ్ ఉత్సవాలను జరుపుకోవాలని ప్రజలకి సూచించారు.

Similar News

News August 25, 2025

HYD: సోలార్ కారిడార్‌గా ఔటర్ రింగ్ రోడ్డు !

image

నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును సోలార్ కారిడార్‌గా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. హెచ్ఎండీఏ అధికారులు ఇప్పటికే 21 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్‌పై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేశారు. దీంతో దాదాపు 16 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. అలాగే 158 కిలోమీటర్లు ఉన్న ఔటర్లో సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేసి 100 మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

News August 24, 2025

మూసీ పరివాహకంలో వ్యక్తి మృతదేహం లభ్యం!

image

అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూసీ పరివాహక ప్రాంతంలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుడు మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడి వివరాలు తెలిస్తే అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ SHO నంబర్ 8712660590కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

News August 24, 2025

బీసీ రిజర్వేషన్లు.. గాంధీభవన్ కీలక నిర్ణయం ?

image

రాష్ట్రంలో ఇపుడు ఎక్కడ చూసినా 42 శాతం బీసీ రిజర్వేషన్లపైనే సాగుతోంది. ఈ నేపథ్యంలో జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నిర్ణయంపై కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ సీటును బీసీ అభ్యర్థికి కేటాయించి బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ప్రజలకు చెప్పకనే చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఈ విషయంపై పార్టీ అధిష్ఠానం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.