News August 24, 2025
కర్నూలు: ఈనెల 29న సరిహద్దుల మార్పు కోసం విజ్ఞప్తుల స్వీకరణ

ఉమ్మడి జిల్లాకు సంబంధించి కర్నూలు సునయన ఆడిటోరియంలో 29న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మండల, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పు కోసం అభ్యర్థనలు స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. జిల్లా, మండల, గ్రామాల పేర్లు, అలాగే వాటి సరిహద్దులు మార్పు కోసం ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి ఈనెల 29న రాష్ట్ర మంత్రుల బృందం విజ్ఞప్తులను స్వీకరిస్తారని నంద్యాల కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు.
Similar News
News August 25, 2025
840 కొత్త బార్లకు 30 అప్లికేషన్లే!

AP: నూతన <<17448943>>బార్<<>> విధానానికి స్పందన కరువైంది. మొత్తం 840 బార్లకు నిన్నటి వరకు 30 అప్లికేషన్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. లైసెన్స్ దరఖాస్తులకు రేపటితో గడువు ముగియనుంది. దీంతో ఎక్సైజ్ అధికారుల్లో ఆందోళన నెలకొంది. బార్లకు ఇచ్చే మద్యంపై పన్ను, ఒక్కో బార్కు నాలుగు దరఖాస్తులు తప్పనిసరంటూ నిబంధనలు వ్యాపారుల నుంచి వ్యతిరేకతకు కారణమని సమాచారం. అయితే నిబంధనల్లో మార్పులు ఉండబోవని అధికారులు చెబుతున్నారు.
News August 25, 2025
అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ APలోని శ్రీకాకుళం, విజయనగరంలో రేపు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరిలో భారీ వర్షాలు, ఇతర చోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు TGలోని రంగారెడ్డి, HYD, మేడ్చల్, KMM, ఉమ్మడి ADB, వరంగల్, KNR, నల్గొండ, MBNRలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News August 25, 2025
HYD: ఆగస్టు 31న అనంతగిరి హిల్స్ బర్డ్ వాక్..!

అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో బర్డ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి 14 మంది పక్షుల ప్రేమికులు పాల్గొన్నారు. పక్షుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ తెలిపారు. తదుపరి బర్డ్ వాక్ ఆగస్టు 31న అనంతగిరి హిల్స్లో జరగనుంది.