News August 24, 2025
రూ.70లక్షల అప్పుచేసి వ్యాపారి పరార్

గంగాధర మండలం గర్షకుర్తికి చెందిన మిట్టపెల్లి రాజేశం అనే చీరల వ్యాపారిని, అతనితో పాటు గ్రామానికి చెందిన మరికొందరిని తమిళనాడుకు చెందిన వినోత్ రాజ్ మోసం చేశాడు. టెక్స్టైల్స్ వ్యాపారం పేరుతో రూ.70 లక్షలకుపైగా అప్పు చేసి పరారయ్యాడు. రాజేశం ఇంట్లో అద్దెకు ఉంటున్న వినోత్ రాజ్ ఈ మోసానికి పాల్పడినట్లు ఎస్సై వంశీ కృష్ణ తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Similar News
News August 25, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 25, సోమవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.47 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.01 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.18 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.45 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.35 గంటలకు
✒ ఇష: రాత్రి 7.49 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News August 25, 2025
కాశినాయన: బాల్ బ్యాట్మెంటన్లో సత్తా చాటిన విద్యార్థులు

రాజంపేటలో ఆదివారం జరిగిన బాల్ బ్యాట్మెంటన్ పోటీలలో కాశినాయన మండలం నరసాపురం ZPHS విద్యార్థులు సత్తా చాటారు. ఉమ్మడి కడప జిల్లా బాల్ బ్యాట్మెంటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. సబ్ జూనియర్స్ విభాగంలో ఇర్ఫాన్, సంపత్, సీనియర్ విభాగంలో సోహెల్ ఈ నెల 29, 30, 31వ తేదీలలో ప్రకాశం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో వారిని పలువురు అభినందించారు.
News August 25, 2025
తంబళ్లపల్లె: షూటింగ్ బాల్ జూనియర్ జట్టుకు ముగ్గురు ఎంపిక

తంబళ్లపల్లె (M) కన్నెమడుగు హై స్కూల్ నుంచి ముగ్గురు విద్యార్ధినులు జూనియర్ షూటింగ్ జిల్లా జట్టుకు ఎంపికయ్యారని పీడీ ఖాదర్ బాషా తెలిపారు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్ధినులు రిషిత, ప్రియ ప్రవల్లికతో పాటు స్టాండ్ బైగా స్వాతి ఎంపికయ్యారన్నారు. మదనపల్లెలోని ఓ పాఠశాలలో ఆదివారం జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఛైర్మన్ జునైద్ అక్బరీ, కార్యదర్శి గౌతమి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా జట్టు ఎంపిక జరిగింది.