News August 24, 2025

PHOTO: బుట్టలెన్ని అల్లినా బువ్వ కరువాయే

image

కొన్ని వృత్తుల వారు ఎంత శ్రమించినా ఆకలి తీరని పరిస్థితి, దానికి ఉదాహరణే పై చిత్రం. పాచిపెంటలో బుట్టలు అల్లుకుని 10 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అడవి నుంచి వెదురు కలప తెచ్చి బుట్టలతో గృహలంకరణ వస్తువులు అల్లి వాటిని స్థానికంగా విక్రయించడంతో పాటు ఒడిశాకి ఎగుమతి చేస్తుంటారు. ప్లాస్టిక్ బుట్టలు వాడకంతో పాటు మద్దతు ధర లేక పూట గడవడం కష్టమవుతోందని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

Similar News

News August 25, 2025

డీఎస్సీ అభ్యర్థుల వెరిఫికేషన్ వాయిదా: డీఈవో

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థుల వెరిఫికేషన్‌ను సోమవారం సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాలతో రద్దు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. వెరిఫికేషన్‌కు సంబంధించిన తదుపరి తేదీ త్వరలో ప్రకటిస్తామని ఆమె తెలిపారు.

News August 25, 2025

అదనంగా సర్వీస్ ఛార్జీ ఎందుకు చెల్లించాలి: HC

image

హోటళ్లు, రెస్టారెంట్లలో వసూలు చేస్తున్న సర్వీస్‌ ఛార్జీలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.20 వాటర్ బాటిల్‌కు రూ.100 తీసుకుంటున్నప్పుడు మళ్లీ విడిగా సర్వీస్ ఛార్జీ ఎందుకు చెల్లించాలని ప్రశ్నించింది. ఛార్జీ తప్పనిసరి కాదంటూ గతంలో హైకోర్టు ఏకసభ్య ధర్మానసం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ భారత హోటళ్లు, రెస్టారెంట్ల సంఘాలు పిటిషన్ వేశాయి. తాజాగా ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

News August 25, 2025

సింధు సత్తా చాటేనా!

image

నేటి నుంచి BWF వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మొదలు కానుంది. మెన్స్ సింగిల్స్‌లో భారత ప్లేయర్ లక్ష్యసేన్ టాప్ సీడ్ షియుక్వి(చైనా)తో తలపడనున్నారు. మహిళల విభాగంలో PV సింధు బల్గేరియాకు చెందిన కలోయాన‌తో పోటీ పడనున్నారు. ఈ టోర్నీలోనైనా సింధు ఫామ్ అందుకుంటారో చూడాలి. ఇక మెన్స్ డబుల్స్‌లో IND నుంచి సాయిరాజ్-చిరాగ్‌ జోడీ, ఉమెన్స్ డబుల్స్‌లో ప్రియా-శ్రుతి మిశ్రా, రుతుపర్ణ-శ్వేతపర్ణ బరిలో ఉన్నారు.