News August 24, 2025

మేడ్చల్: చివరకు మొండెమే మిగిలింది: డీసీపీ

image

మహేందర్ రెడ్డి పథకం ప్రకారమే <<17503036>>భార్య స్వాతి<<>>ని హత్య చేశాడని మల్కాజిగిరి డీసీపీ తెలిపారు. మేడిపల్లిలో భార్య హత్య కేసు వివరాలను డీసీపీ వెల్లడించారు. శవాన్ని మాయం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నించాడని, విడతల వారీగా భార్య శరీర భాగాలు బయటకు తీసుకెళ్లి పారేశాడన్నారు. పోలీసులు వెళ్లి చూసేసరికి కేవలం మొండెం మాత్రమే మిగిలిందని, మొండానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News August 25, 2025

HYD: 70 మంది పోకిరీల పనిపట్టిన షీ టీమ్స్

image

మహానగరంలో పోకిరీల బెడద నుంచి కాపాడాలని సైబరాబాద్ షీ టీమ్స్‌కు పలువురు ఫోన్ చేసే సహాయం అర్థిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు షీటీమ్స్ సిబ్బంది 143 డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించారు. అసభ్యకరంగా వేధిస్తున్న 70 మందిని పట్టుకున్నట్లు డీసీపీ సృజన కరణం తెలిపారు. అంతేకాక 34 మంది భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వివరించారు. బాధితులు 181, 1098కు ఫోన్ చేసి చెప్పాలని ఈ సందర్భంగా సూచించారు. 

News August 25, 2025

HYD: కార్యకర్తలతో సెల్ఫీ దిగిన KTR

image

శేరిలింగంపల్లిలో బీఆర్‌ఎస్ కార్యకర్తలతో ఆత్మీయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సమావేశమయ్యారు. తమ అభిమాన నాయకుడిని చూసిన కార్యకర్తలు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో కేటీఆర్ స్వయంగా వారితో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. దీంతో కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పార్టీలో కొందరు ప్రధాన నేతలు మోసం చేసినా.. కార్యకర్తలు పార్టీని గుండెల్లో పెట్టుకుని చేసుకుంటున్నారని వారిని కీర్తించారు.

News August 25, 2025

HYD: గణేశ్ మండపాలకు ఫ్రీ కరెంట్

image

గణేశ్ మండప నిర్వాహకులకు విద్యుత్ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. నిర్వాహకులు కనెక్షన్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గ్రేటర్‌లో గతంలో కమర్షియల్‌ కేటగిరి కింద తాత్కాలిక కనెక్షన్లు జారీ చేసి రూ.1,500 వరకు వసూలు చేసేవారు. ప్రభుత్వం ఈ నెల 27 నుంచి వచ్చేనెల 6 వరకు మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనుంది.