News August 24, 2025

రైలులో తరలిస్తున్న మాదకద్రవ్యాలు స్వాధీనం

image

రైలులో అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను ఈగల్ సెల్ బాపట్ల టీం సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం బాపట్ల రైల్వే స్టేషన్ నుంచి పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో ఈగల్ సెల్, రైల్వే పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. రైలులో అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశామన్నారు.

Similar News

News August 25, 2025

నేటి నుంచే కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

image

కడప జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నేటి నుంచి జిల్లా పోలీస్ కార్యాలయంలో డాక్యుమెంట్ల పరిశీలన చేయనున్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. సోమవారం హాల్ టికెట్ నెం.4001160 నుంచి 4206930 అభ్యర్థుల డాక్యుమెంట్ల పరిశీలిస్తారు. మంగళవారం హాల్ టికెట్ నెం.4214369 నుంచి 4504062 అభ్యర్థుల వివరాలు క్రాస్ చెక్ చేస్తారు.

News August 25, 2025

ఖమ్మం: వేధిస్తున్నాడని భర్తని చితకబాదిన భార్య

image

మద్యం తాగి భర్త వేధిస్తున్నాడని భార్య చితకబాదిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వీఎంబంజర్ గ్రామానికి చెందిన పర్వతం గంగరాజు, లక్ష్మికి 25 ఏళ్ల కిందట వివాహమైంది. భర్త రోజూ తాగి లక్ష్మిని వేధిస్తున్నాడు. వేధింపులు తాళలేక లక్ష్మి ఆదివారం భర్తను చితకబాదింది. గంగరాజుకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News August 25, 2025

విశాఖ: కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్

image

రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నేటి నుంచి మొదలుకానుంది. విశాఖ జిల్లాలో 5,17,149 కుటుంబాలకు కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వలస వెళ్లిన లబ్ధిదరులు తమ కార్డును నమోదు చేసుకున్న రేషన్ దుకాణం వద్దే తీసుకోవాలన్నారు. ఏటీఎమ్ కార్డు సైజు, క్యూఆర్ కోడ్‌తో ఈ కార్డు ఉంటుంది.