News August 24, 2025

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 42శాతం రిజర్వేషన్లపై న్యాయ నిపుణులతో భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే, ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసుల అంశంపైనా చర్చించనున్నట్లు వెల్లడించాయి. అట్నుంచి ఆయన ఎల్లుండి బిహార్ వెళ్లి రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రేపు ఉదయం ఓయూలో జరిగే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని తెలుస్తోంది.

Similar News

News August 25, 2025

మానవ మృగాలు ఫామ్‌హౌస్‌లో ఉన్నాయి: CM రేవంత్

image

TG: ప్రతిపక్ష నేతలే టార్గెట్‌గా OUలో CM రేవంత్ పరోక్షంగా విమర్శలు చేశారు. ‘సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఏనుగులు ఉన్నాయని అభివృద్ధి కాకుండా అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఏనుగులు, సింహాలు లేవు. కేవలం మానవ రూపంలో ఉన్న మృగాలే ఉన్నాయి. అవి కూడా ఫామ్‌హౌజ్‌లో ఉన్నాయి. వాటిని నిర్బంధించడానికి వలలు వేయండి. లేని ఏనుగులు, సింహాలను నేను చంపేస్తున్నానని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు’ అని రేవంత్ మండిపడ్డారు.

News August 25, 2025

ఇష్టారీతిన బిల్డింగులు కట్టొద్దు: నారాయణ

image

AP: గత ప్రభుత్వంలో ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఇష్టమొచ్చినట్లు బిల్డింగ్స్ కట్టారని మంత్రి నారాయణ ఆరోపించారు. ‘ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ ఇప్పటికే ఇచ్చాం. బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీమ్‌పై వర్క్ చేస్తున్నాం. నెలనెలా శాటిలైట్ పిక్చర్స్ స్టడీ చేసి.. ప్లానింగ్‌కి డీవియేషన్ ఉంటే CM చర్యలు తీసుకోమన్నారు. ఎవరైనా సరే డీవియేషన్ లేకుండా భవనాలు కట్టుకోండి. తేడాలుంటే ఇబ్బందులు పడతారు’ అని విజ్ఞప్తి చేశారు.

News August 25, 2025

మళ్లీ ఓయూకు వస్తా.. ఆర్ట్స్ కాలేజీ ముందు మీటింగ్ పెడతా: రేవంత్

image

TG: డిసెంబర్‌లో మరోసారి తాను ఓయూకు వస్తానని CM రేవంత్ ప్రకటించారు. ఆర్ట్స్ కాలేజీ ముందు మీటింగ్ పెట్టి, వర్సిటీకి రూ.వందల కోట్ల నిధులు ఇస్తానన్నారు. ఆరోజు ఒక్క పోలీస్ కూడా క్యాంపస్‌లో ఉండొద్దని DGPని ఆదేశించారు. నిరసన తెలిపే విద్యార్థులకు ఆ స్వేచ్ఛ కల్పిస్తానని తేల్చి చెప్పారు. తాను రావొద్దనే ఆలోచన ఏ విద్యార్థికీ ఉండదని.. గొర్రెలు, బర్రెలు పెంచుకునేటోడికి మాత్రమే ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.