News August 24, 2025
కామారెడ్డిలో రేపు ప్రజావాణి

కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News August 25, 2025
చొప్పదండి: వృద్ధురాలిని రక్షించిన ఫైర్ సిబ్బంది

చొప్పదండి పట్టణంలో ప్రమాదవశాత్తు బావిలో పడ్డ ఓ వృద్ధురాలిని ఫైర్ అధికారులు కాపాడిన ఘటన సోమవారం జరిగింది. స్థానిక 13వ వార్డుకు చెందిన పంచల భాగ్యలక్ష్మి అనే వృద్ధురాలు అనుకోకుండా బావిలో పడింది. విషయం తెలిసిన వెంటనే చొప్పదండి ఫైర్ స్టేషన్ ఆఫీసర్ పవన్ ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది రెస్కు ఆపరేషన్లో భాగంగా తాళ్ల సాయంతో వృద్ధురాలిని
క్షేమంగా బయటికు తీశారు. ఈ సందర్భంగా పలువురు ఫైర్ సిబ్బందిని అభినందించారు.
News August 25, 2025
ఆశాలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలి: హరీశ్ రావు

ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. సోమవారం డిమాండ్ల సాధనకై ఇందిరాపార్క్ వద్ద ఆశా వర్కర్లు చేపట్టిన మహా ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆశా వర్కర్ల శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదని విమర్శించారు. ఆశా వర్కర్ల రాష్ట్ర అధ్యక్షురాలు సంతోష పాల్గొన్నారు.
News August 25, 2025
వరంగల్ మార్కెట్లో ఉత్పత్తుల ధరలు ఇలా..!

వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు (బిల్టీ) రూ.2,365, సూక పల్లికాయ రూ.6,200, పచ్చి పల్లికాయ రూ.3,500 పలికాయి. అలాగే 5531 రకం మిర్చికి రూ.13 వేలు, ఇండిక మిర్చి రూ.13,800, డీడీ మిర్చి రూ.14 వేలు, నం.5 రకం మిర్చికి రూ.13,300 ధర లభించిందని వ్యాపారులు తెలిపారు.