News August 24, 2025
త్వరలో RSS కీలక మీటింగ్.. వీటిపైనే చర్చ!

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) వార్షిక సమావేశం SEP 5-7 వరకు రాజస్థాన్లోని జోధ్పూర్లో జరగనుంది. RSS చీఫ్ మోహన్ భాగవత్ ఆధ్వర్యంలో జరిగే ఈ మీటింగ్కు BJP సహా ABVP, భారతీయ మజ్దూర్, కిసాన్ సంఘ్, స్వదేశీ జాగరణ్ మంచ్, వనవాసీ కళ్యాణ్, సేవా సమితి తదితర అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. BJP తదుపరి చీఫ్ ఎన్నికతో పాటు US టారిఫ్స్ ఇతర సమకాలీన కీలక అంశాలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News August 25, 2025
స్వదేశీ వస్తువులే కొనండి: మోదీ

యువత స్వదేశీ వస్తువులనే కొనాలని PM మోదీ పిలుపునిచ్చారు. “ఒక్క విదేశీ వస్తువును కూడా ఇంటికి తీసుకురాకూడదని యువత నిర్ణయించుకోవాలి. స్వదేశీ వస్తువులే విక్రయిస్తామని వ్యాపారులు తమ దేశభక్తిని చాటుకోవాలి. ‘మేము స్వదేశీ వస్తువులే విక్రయిస్తాం’ అని దుకాణాల బయట బోర్డులు పెట్టాలి. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ మన బలం. స్వదేశీ ఉద్యమం మన భవిష్యత్తుకు భరోసానిస్తుంది” అని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో అన్నారు.
News August 25, 2025
నచ్చినచోట ఆయిల్ కొంటాం: భారత్

ఇండియన్ గూడ్స్పై US టారిఫ్స్ ఆంక్షల నేపథ్యంలో రష్యాలోని భారత అంబాసిడర్ వినయ్ కుమార్ ఫైరయ్యారు. ‘మార్కెట్లో బెస్ట్ డీల్ ఎక్కడుంటే అక్కడే భారత్ ఆయిల్ కొనుగోళ్లను కొనసాగిస్తుంది. US నిర్ణయం అసమంజసం. ఇది ఫెయిర్ ట్రేడ్ రూల్స్ను అణచివేయడమే. 140 కోట్ల భారతీయుల అవసరాలు తీర్చడానికే ప్రాధాన్యమిస్తాం. రష్యాతో పాటు పలు దేశాలతో భారత సహాయ సహకారాల వల్లే గ్లోబల్ ఆయిల్ మార్కెట్ స్థిరపడింది’ అని స్పష్టం చేశారు.
News August 25, 2025
OT డ్యూటీలతో ఆరోగ్యంపై ప్రభావం: సర్వే

ఉద్యోగుల్లో ఓవర్ టైమ్(OT) వర్క్ చేయడంపై వ్యతిరేకత ఉందని జీనియస్ HR టెక్ సర్వేలో తేలింది. అదనపు ప్రయోజనాలు లేకుండా వర్కింగ్ అవర్స్ను పొడిగించడాన్ని మెజార్టీ ఉద్యోగులు వ్యతిరేకించినట్లు పేర్కొంది. ఓవర్ టైమ్ డ్యూటీలతో వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని 44% మంది ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది. తగిన బెనిఫిట్స్ ఉంటే OT చేసేందుకు ఇబ్బందేమీ లేదని 40శాతం చెప్పినట్లు వెల్లడించింది.