News August 24, 2025
ఖమ్మం: ట్రాక్టర్ రోటవేటర్ కిందపడి బాలుడు మృతి

కూసుమంచి మండలం కొత్తతండాలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ క్షేత్రంలో తండ్రి రాంబాబు ట్రాక్టర్తో దుక్కి దున్నుతుండగా దానిపై కూర్చున్న ఆరేళ్ల బాలుడు భువనేశ్వర్ ప్రమాదవశాత్తు రోటవేటర్లో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్లెదుటే కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. దీంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
Similar News
News August 25, 2025
KMM: ఉపాధ్యాయ పదోన్నతుల జాబితా సిద్ధం

ఖమ్మం జిల్లాలో ఎస్టీల నుంచి ఎస్ఏ(స్కూల్ అసిస్టెంట్లు)లుగా పదోన్నతి పొందే వారి జాబితాను విద్యాశాఖ సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లాలో 1: 3 నిష్పత్తిలో సుమారు 600 మంది ఎస్టీలు ఉండగా 1:1 నిష్పత్తిలో వివిధ సబ్జెక్ట్లు సంబంధించి 207 మందితో తుది జాబితా తయారు చేశారు. కాగా ఈరోజు ఈ 207 మందికి వెబ్ ఆప్షన్లు మొదలుకానున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
News August 25, 2025
ఖమ్మం: వేధిస్తున్నాడని భర్తని చితకబాదిన భార్య

మద్యం తాగి భర్త వేధిస్తున్నాడని భార్య చితకబాదిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వీఎంబంజర్ గ్రామానికి చెందిన పర్వతం గంగరాజు, లక్ష్మికి 25 ఏళ్ల కిందట వివాహమైంది. భర్త రోజూ తాగి లక్ష్మిని వేధిస్తున్నాడు. వేధింపులు తాళలేక లక్ష్మి ఆదివారం భర్తను చితకబాదింది. గంగరాజుకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News August 25, 2025
ఖమ్మంలో మట్టి గణపయ్య విగ్రహాలు పంపిణీ

ఖమ్మం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు నుంచి గణపయ్య ఉచిత విగ్రహాల పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు కమిషనర్ 8 వేల మట్టి విగ్రహాలను కేఎంసీకి తెప్పించారు. ఆదివారం రాత్రికి విగ్రహాలు కేఎంసీకి చేరుకున్నాయి. అన్ని ప్రాంతాల్లో వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరం నగరంలో మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసి పర్యావరణం పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ అధికారులు కోరారు.