News August 25, 2025
KMR: వరల్డ్ ఐకాన్ అవార్డ్ అందుకున్న డా.రవీంద్ర మోహన్

ఎల్లారెడ్డి, పిట్లం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇన్ఛార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్ ‘మోస్ట్ కంపాషినెట్ సర్జన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం అందుకున్నారు. దిల్లీలో జరిగిన ‘వరల్డ్ ఐకాన్ అవార్డ్స్’ వేడుకలో ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, ఎరిట్రియన్ అంబాసిడర్ అలెమ్ త్సేహాయ్ వోల్డెమరియమ్, ట్రేడ్ కమిషనర్ డాక్టర్ సెనోరిటా ఐజాక్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు.
Similar News
News August 25, 2025
ఆశాలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలి: హరీశ్ రావు

ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. సోమవారం డిమాండ్ల సాధనకై ఇందిరాపార్క్ వద్ద ఆశా వర్కర్లు చేపట్టిన మహా ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆశా వర్కర్ల శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదని విమర్శించారు. ఆశా వర్కర్ల రాష్ట్ర అధ్యక్షురాలు సంతోష పాల్గొన్నారు.
News August 25, 2025
వరంగల్ మార్కెట్లో ఉత్పత్తుల ధరలు ఇలా..!

వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు (బిల్టీ) రూ.2,365, సూక పల్లికాయ రూ.6,200, పచ్చి పల్లికాయ రూ.3,500 పలికాయి. అలాగే 5531 రకం మిర్చికి రూ.13 వేలు, ఇండిక మిర్చి రూ.13,800, డీడీ మిర్చి రూ.14 వేలు, నం.5 రకం మిర్చికి రూ.13,300 ధర లభించిందని వ్యాపారులు తెలిపారు.
News August 25, 2025
శ్రీశైలాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలని డిమాండ్

ప్రకాశం జిల్లా పునర్విభజన నేపథ్యంలో తెరపైకి సరికొత్త డిమాండ్ వచ్చింది. శ్రీశైలం మండలాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలని కోరుతూ సంతకాలు సేకరించారు. ‘మార్కాపురానికి దగ్గర శ్రీశైలం ఉంది. ఇక్కడి గిరిజనులకు మార్కాపురంతో అనుబంధం ఉంది. వెలిగొండ, శ్రీశైలం ప్రాజెక్టులతో భవిష్యత్తులో నీటి వివాదాలు వస్తాయి. వీటికి పరిష్కారంగా శ్రీశైలాన్ని మార్కాపురంలో కలపాలి’ అని TDP నేత కందుల రామిరెడ్డి కోరారు.