News August 25, 2025
ఇవాళ అందుబాటులోకి DSC కాల్ లెటర్లు

AP: DSCకి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన కాల్లెటర్లు నేటి నుంచి అభ్యర్థుల లాగిన్లో అందుబాటులో ఉంచనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. తొలుత ఈరోజు నుంచే వెరిఫికేషన్ చేపట్టాలని భావించినా, సాంకేతిక ఇబ్బందుల కారణంగా కాల్ లెటర్ల జారీ ఆలస్యంతో వాయిదా వేసింది. మొత్తం 16,347 పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన తర్వాత తుది జాబితా సిద్ధం చేసి పోస్టింగ్ ఇస్తారు.
Similar News
News August 25, 2025
BJP అబద్ధాలాడుతోంది: మంత్రి తుమ్మల

TG: రాష్ట్రానికి యూరియా తెప్పించేందుకు ఎంతవరకైనా పోరాడతామని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ లేఖ రాశారు. ‘యూరియా సరఫరాలో కేంద్రం విఫలమైంది. RFCLలో ఉత్పత్తి నిలిచిపోవడంతో యూరియా రాలేదు. కేంద్ర వైఫల్యాన్ని రాష్ట్రంపై నెట్టాలని చూస్తున్నారు. దేశవ్యాప్తంగా కొరత ఉంటే కేవలం TGలోనే ఉన్నట్లు BJP అబద్ధాలాడుతోంది. యూరియా కోసం రైతులు క్యూ కట్టారంటూ అసత్య ప్రచారం జరుగుతోంది’ అని పేర్కొన్నారు.
News August 25, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* కేరళ తరహాలో కోనసీమను అభివృద్ధి చేస్తాం: PVN మాధవ్
* నా ఎదుగుదల ఓర్వలేక కొన్ని ఛానళ్లు నాపై దుష్ప్రచారం చేస్తున్నాయి: మంత్రి సంధ్యారాణి
* గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్: ఏపీ ప్రభుత్వానికి రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి కమిటీ కృతజ్ఞతలు
* స్మార్ట్ రేషన్ కార్డుల ప్రింటింగ్కు రూ.8కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
* అడ్డగోలుగా దివ్యాంగుల పెన్షన్లు తొలగించారు: లేళ్ల అప్పిరెడ్డి
News August 25, 2025
J&K: ప్రభుత్వ కార్యాలయాల్లో పెన్డ్రైవ్, వాట్సాప్పై నిషేధం

ప్రభుత్వ కార్యాలయాల్లో పెన్డ్రైవ్, వాట్సాప్ వాడకాన్ని J&K ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ సమాచారాన్ని పరిరక్షించడం, డేటా ఉల్లంఘనలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో ఇకపై ప్రభుత్వ కార్యకలాపాల కోసం పెన్డ్రైవ్ వాడకూడదు. అధికారిక సమాచారాన్ని వాట్సాప్ లేదా ఇతర SM ఫ్లాట్ఫామ్స్లో షేర్ చేయకూడదు. డేటా షేరింగ్ కోసం క్లౌడ్-ఆధారిత GovDrive ప్లాట్ఫామ్ ఉపయోగించాల్సి ఉంటుంది.