News August 25, 2025

విశాఖలో ఖమ్మం యువతి అత్మహత్య

image

విశాఖలో ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇది. ఖమ్మం జిల్లాకు చెందిన నరేశ్, రమ్య HYDలో పనిచేస్తూ ప్రేమించుకున్నారు. ఈనెల 11న ఇద్దరూ విశాఖ వచ్చారు. కొబ్బరితోట ఏరియాలో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. పెళ్లి చేసుకుందామని రమ్య కోరగా..‘నాకు ముందే పెళ్లి అయ్యింది. నిన్ను చేసుకోలేను’ అని చెప్పి నరేశ్‌ ఎటో వెళ్లిపోయాడు. ఇంట్లో రమ్య శనివారం ఉరేసుకుంది. నరేశ్‌ని అరెస్ట్ చేసినట్లు 2టూన్ CI ఎర్రన్నాయుడు తెలిపారు.

Similar News

News August 26, 2025

విశాఖ సీపీ కార్యాలయానికి 110 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్‌లో సోమవారం 110 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

News August 25, 2025

విశాఖ పోర్టు రోడ్డులో భారీ వాహనాలకు అనుమతి లేదు

image

కేంద్ర రక్షణశాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. మ.12.30 నిమిషాలకు I.N.S సర్కార్‌కు చేరుకొని ఉదయగిరి, హిమగిరి అనే నౌకలను ప్రారంభించనున్నారు. ఆయన ప్రసంగించిన తర్వాత సాయంత్రం 5.25 నిముషాలకు తిరిగి బయలుదేరుతారు. V.V.I.P రాక సందర్భంగా విశాఖపట్నం పోర్ట్ రోడ్డులో రేపు భారీ వాహనాలకు అనుమతి లేదని పోర్టు అధికారులు తెలిపారు.

News August 25, 2025

విశాఖ జిల్లాలో 5,616 స్మార్ట్ కార్డులు పంపిణీ: జేసీ

image

జిల్లాలో సోమవారం 5,616 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశామని జేసీ మయూర్ అశోక్ తెలిపారు.‌ ఈనెల 31 వరకు సచివాలయాల సిబ్బంది ద్వారా స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఇంటి వద్దనే పంపిణీ చేస్తామన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు సంబంధిత రేషన్ దుకాణాల వద్ద పంపిణీ చేస్తామన్నారు. పాత బియ్యం కార్డు, ఆధార్ అనుసంధానమైన మొబైల్ నంబరుతో సచివాలయ సిబ్బంది నుంచి స్మార్ట్ కార్డులు తీసుకోవాలన్నారు.