News August 25, 2025
గణనాథుడు.. ఈసారి ‘స్వీట్’ సర్ప్రైజ్

తాడిపత్రిలోని వినాయక కాంప్లెక్స్లో ఏటా వివిధ రూపాలలో గణనాథుడిని ఏర్పాటు చేస్తుంటారు. ఈసారి చాక్లెట్ లంబోదరుడిని కొలువుదీరుస్తున్నట్లు తెలిసింది. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా 20 ఏళ్ల నుంచి వినూత్న రీతిలో విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పారు. ఇసుక, టెంకాయ పీచు, విభూది, కాంతార విగ్రహాలను ఇది వరకు ఏర్పాటు చేశామని చెప్పారు.
Similar News
News August 25, 2025
అనంత: ముగిసిన కానిస్టేబుళ్ల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్

అనంతపురం జిల్లాలో సివిల్, ఏపీఎస్పీ విభాగాలకు ఎంపికైన 488 మంది అభ్యర్థులు వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరవ్వాల్సి ఉండగా 470 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా మిగిలిన 18 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. సివిల్ -278 మంది గానూ 266, APSP- 210 మందికి గానూ 204 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వెరిఫికేషన్ ప్రక్రియ కోసం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మొత్తం 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు.
News August 25, 2025
అనంతపురం జిల్లాకు CM రాక.. ఎప్పుడంటే

CM సెప్టెంబర్ మొదటి వారంలో అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సీఎం పర్యటన కోసం అనంతపురం పరిధిలోని SK యూనివర్సిటీ వద్ద అనంతపురం- కదిరి జాతీయ రహదారి పక్కన ఉన్న స్థలాన్ని కలెక్టర్, జిల్లా ఎస్పీ జగదీశ్ పరిశీలించారు.
News August 25, 2025
అనంత: CM ప్రోగ్రాం ఏర్పాటు స్థల పరిశీలన

సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనకు సెప్టెంబర్ 3న రానున్నారు. ఈ నేపథ్యంలో గార్లదిన్నె మండలం కనుంపల్లి గ్రామం (అనంతపురం- హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన) స్థలాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ జగదీశ్ పరిశీలించారు. సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాటు పనులపై జిల్లా కలెక్టర్, ఎస్పీ చర్చించుకున్నారు.