News August 25, 2025
రాయదుర్గం కేబుల్ బ్రిడ్జిపై ఉడిన స్టీల్ గేట్

రాయదుర్గం కేబుల్ బ్రిడ్జిపై స్టీల్ గేట్ ఊడిపోవడంతో నిబంధనల ఉల్లంఘన జరుగుతుందని ప్రజలు మండిపతున్నారు. అనేక మంది పర్యటకులు రోడ్డు మీదే ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతున్నట్లుగా పేర్కొన్నారు. రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి వద్ద అనేక ఘటనలు జరుగుతున్నప్పటికీ కఠినచర్యలు అమలు కావటం లేదని ఆరోపించారు. వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.
Similar News
News August 25, 2025
మెగా DSC.. రేపటి నుంచి కాల్ లెటర్ల డౌన్లోడ్కు అవకాశం

AP: డీఎస్సీ అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్ ఐడీల ద్వారా రేపు(26.08.2025) మధ్యాహ్నం నుంచి కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని మెగా DSC కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. తమకు కేటాయించిన రోజు అభ్యర్థులు తప్పనిసరిగా సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరు కావాలని సూచించారు. హాజరు కాని లేదా అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేసి, మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థిని CV కోసం పిలుస్తామని వెల్లడించారు.
News August 25, 2025
హైదరాబాద్ నుంచి సరికొత్త టూర్ ప్లాన్స్

HYD నుంచి టూర్ వెళ్లాలనుకునే వారికి తెలంగాణ టూరిజం శాఖ కొత్త ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చింది. నగరం నుంచి అరుణాచలం, బెంగళూరు, అన్నవరం ప్రాంతాలకు వెళ్లడానికి వేర్వేరుగా బస్సులను నడుపుతోంది. బెంగళూరు టూర్ 2 రోజులు, అరుణాచలం టూర్ 3 రోజులు, అన్నవరం ట్రిప్ 4 రోజులు ఉండనుంది. పూర్తి వివరాలకు 98485 40371,98481 25947, 98480 07020 నంబర్లకు కాల్ చేయవచ్చని అధికారులు తెలిపారు.
News August 25, 2025
జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా మహమ్మద్ ముజాహిద్

ఖమ్మం జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా సోమవారం మహమ్మద్ ముజాహిద్ భాద్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. ఈ సందర్భంగా మైనార్టీ సంక్షేమ అధికారికి జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.