News April 2, 2024

స్తంభం పైనుంచి పడి కేబుల్ కార్మికుడి దుర్మరణం

image

జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో విద్యుత్ స్తంభం పైనుంచి పడి కేబుల్ కార్మికుడు దుర్మరణం చెందాడు. చిల్లకల్లు పోలీసుల కథనం మేరకు.. దామరచర్ల మండలం బల్లిగుంట తండాకు చెందిన కిరణ్ (30).. చిల్లకల్లు కేబుల్ పనుల గుత్తేదారు వద్ద పనిచేస్తున్నాడు. విద్యుత్ స్తంభానికి అమర్చాల్సిన కేబుల్ తీగ కోసం నిచ్చెన సాయంతో పైకి ఎక్కాడు. అకస్మాత్తుగా పైనుంచి పడిపోవడంతో తలకు తీవ్రగాయమై రక్తస్రావం జరిగి చనిపోయాడు.

Similar News

News September 9, 2025

NLG: ప్రజావాణిలో ఈ ఫిర్యాదులే అధికం..!

image

కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కిటకిటలాడింది. తమ గోడును చెప్పుకునేందుకు వందల సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. మండలాల్లో గ్రీవెన్స్ డే ఉన్నా, తమ సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ ప్రజలు నేరుగా కలెక్టరేట్‌కు వచ్చారు. సోమవారం 87 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో అధికశాతం భూ సమస్యలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినవే ఉన్నాయి. బాధితుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.

News September 9, 2025

నల్గొండలో న్యాయవాదుల విధులు బహిష్కరణ

image

నల్లగొండ జిల్లాలో న్యాయవాది వెంకటయ్యపై జరిగిన దాడిని ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవాదులకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసనతో కోర్టు కార్యకలాపాలు స్తంభించాయి.

News September 9, 2025

NLG: తుది ఓటరు జాబితా విడుదలకు కసరత్తు!

image

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఓటరు జాబితాను బుధవారం విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో మొత్తం 33 మండలాల్లో 33 జడ్పీటీసీ, 353 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. ముసాయిదా ఓటరు జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని అధికారులు సూచించారు.