News August 25, 2025
వరంగల్ మార్కెట్లో ఉత్పత్తుల ధరలు ఇలా..!

వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు (బిల్టీ) రూ.2,365, సూక పల్లికాయ రూ.6,200, పచ్చి పల్లికాయ రూ.3,500 పలికాయి. అలాగే 5531 రకం మిర్చికి రూ.13 వేలు, ఇండిక మిర్చి రూ.13,800, డీడీ మిర్చి రూ.14 వేలు, నం.5 రకం మిర్చికి రూ.13,300 ధర లభించిందని వ్యాపారులు తెలిపారు.
Similar News
News August 26, 2025
ఖానాపూర్: నిస్సహాయ స్థితిలో వ్యక్తి మృతి!

కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫిట్స్ రావడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన ఖానాపూర్ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. మండలంలోని బండమీది మామిడి తండాకు చెందిన బానోతు శ్రీను(42)కు భార్య, పిల్లలు ఉన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శ్రీనుకు మధ్యాహ్నం సమయంలో ఫిట్స్ రావడంతో మృతి చెందాడు. సాయంత్రం స్కూలు నుంచి వచ్చిన పిల్లలు ఎంత పిలిచినా తండ్రి లేవకపోవడంతో, ఇంటి పక్క వారికి సమాచారం ఇచ్చారు.
News August 25, 2025
వరంగల్: అస్తవ్యస్తంగా వీధి దీపాల నిర్వహణ..!

పలు గ్రామాల్లో వీధి దీపాలు వెలగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణకు గాను గత ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు ఏడేళ్ల పాటు బాధ్యతలను అప్పగించింది. స్తంభాలకు విద్యుత్ దీపాలను బిగించిన సంస్థ అనంతరం నిర్వహణను గాలికి వదిలేయడంతో గ్రామాలు అంధకారంలో మునిగాయి. దీనిపై విమర్శలు రావడంతో జీపీల ద్వారా బల్బులు ఏర్పాటు చేశారు. సర్పంచులు లేకపోవడంతో కార్యదర్శులపై భారం పడుతోంది.
News August 24, 2025
నర్సంపేట: జైలర్ లక్ష్మీ శృతి సస్పెండ్

నర్సంపేటలోని జిల్లా మహిళా స్పెషల్ కారాగారం జైలర్ కే.ఎన్.ఎస్. లక్ష్మీ శృతిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. నర్సంపేట మహిళా జైలులో ఈనెల 21న రిమాండ్ ఖైదీ సుచరిత మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. జైలర్ నిర్లక్ష్యంతో రిమాండ్ ఖైదీ మృతి చెందారని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.