News August 25, 2025

ఆశాలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలి: హరీశ్ రావు

image

ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. సోమవారం డిమాండ్ల సాధనకై ఇందిరాపార్క్ వద్ద ఆశా వర్కర్లు చేపట్టిన మహా ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆశా వర్కర్ల శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదని విమర్శించారు. ఆశా వర్కర్ల రాష్ట్ర అధ్యక్షురాలు సంతోష పాల్గొన్నారు.

Similar News

News August 26, 2025

ఎన్టీఆర్, రామ్ చరణ్ మూవీల్లో ఛాన్స్.. శ్రీలీల ఏమన్నారంటే?

image

ఒకవేళ రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల్లో ఒకేసారి నటించే అవకాశం వస్తే డై అండ్ నైట్ షిఫ్టులు చేస్తానంటూ హీరోయిన్ శ్రీలీల ఓ టాక్ షోలో చెప్పారు. తనతో కలిసి నటించిన వారిలో హీరో రవితేజ అల్లరి ఎక్కువ చేస్తారని తెలిపారు. సమంత తన ఫేవరెట్ నటి అని, తాను కాకుండా ప్రస్తుతం టాలీవుడ్‌లో డాన్సింగ్ క్వీన్ సాయిపల్లవి అని పేర్కొన్నారు. కాగా రవితేజతో ఈ అమ్మడు నటించిన ‘మాస్ జాతర’ విడుదలకు సిద్ధంగా ఉంది.

News August 26, 2025

ఖానాపూర్: నిస్సహాయ స్థితిలో వ్యక్తి మృతి!

image

కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫిట్స్ రావడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన ఖానాపూర్ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. మండలంలోని బండమీది మామిడి తండాకు చెందిన బానోతు శ్రీను(42)కు భార్య, పిల్లలు ఉన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శ్రీనుకు మధ్యాహ్నం సమయంలో ఫిట్స్ రావడంతో మృతి చెందాడు. సాయంత్రం స్కూలు నుంచి వచ్చిన పిల్లలు ఎంత పిలిచినా తండ్రి లేవకపోవడంతో, ఇంటి పక్క వారికి సమాచారం ఇచ్చారు.

News August 26, 2025

గాజా ఆసుపత్రిపై దాడి.. ఐదుగురు జర్నలిస్టులు మృతి!

image

గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా ఓ ఆసుపత్రిపై చేసిన దాడిలో 20 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. వీరిలో ఐదుగురు జర్నలిస్టులు ఉన్నారని తెలిపింది. రాయిటర్స్, అసోసియేటెడ్ ప్రెస్ వంటి సంస్థలతో కలిసి పనిచేసిన వారు ఉన్నారని వెల్లడించింది. మరోవైపు ఈ దాడులతో తాను సంతోషంగా లేనని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి అని తుర్కియే దుయ్యబట్టింది.