News August 25, 2025

NZB: విగ్రహాలు తరలించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి: CP

image

గణేశ్ మండలి నిర్వహకులు విగ్రహాలను తరలించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిజామాబాద్ CP సాయి చైతన్య సూచించారు. కొన్ని రోజులుగా 4 విద్యుత్ ప్రమాదాలు జరిగాయని, వాటిలో 9 మంది యువకులు మరణించారని పేర్కొన్నారు. గణేశ్ విగ్రహాల రవాణా, స్థాపించే మండపాల వద్ద ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ పోల్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

Similar News

News August 27, 2025

NZB: SRSP 17 గేట్లు ఎత్తివేత

image

SRSPకి వరద నీరు పోటెత్తుడడంతో మొత్తం 17 వరద గేట్లను అధికారులు ఓపెన్ చేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు 8 గేట్లు ఎత్తగా ఇన్ ఫ్లో పెరగడంతో మధ్యాహ్నం 12 గంటలకు మరో 9 గేట్లు ఓపెన్ చేసి మొత్తం 17 గేట్ల ద్వారా 51,578 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ ఫ్లోగా 50 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా వివిధ మార్గాల ద్వారా 82,105 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.

News August 27, 2025

SRSP UPDATE: 1,090.90 అడుగులకు చేరిన నీటిమట్టం

image

శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. బుధవారం ఉదయం 11 గంటలకు 1,090.90 అడుగులకు(80.053TMC) నీటి మట్టం చేరినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి 45 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు 55,527 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు వివరించారు.

News August 27, 2025

NZB: GGH మరమ్మతులకు రూ.2.76 కోట్లు

image

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(GGH) భవనం మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.2.76 కోట్లు మంజూరు చేసినట్లు GGH సూపరింటెండెంట్ డాక్టర్ పీ.శ్రీనివాస్ తెలిపారు. ఈ నిధులతో మరుగుదొడ్లు, డ్రెయినేజీలు, తలుపులు, కిటికీలు, భవనం ముందు భాగంలో మరమ్మతులు చేపట్టడంతోపాటు పాలియేటివ్ కేర్ సెంటర్ అభివృద్ధి, ల్యాబ్ మరమ్మతులు, టీహబ్ విస్తరణ పనులు చేపడతామని ఆయన పేర్కొన్నారు.