News August 25, 2025
విశాఖలో రైల్వే ఆధునీకరణపై ఎంపీ భరత్ సమీక్ష

విశాఖ ఎంపీ శ్రీభరత్ సోమవారం చిన్న వాల్తేరు రైల్వే గెస్ట్ హౌస్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎం సందీప్ మాధుర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖలో రైల్వే అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాలు, కొత్త రైళ్లు, ఆధునిక సదుపాయాలపై చర్చించి రైల్వే ప్రాజెక్టులు వేగవంతం కావాలని కోరారు. జీఎం పూర్తి సహకారం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రైల్వే అభివృద్ధి కొనసాగుతుందని ఎంపీ స్పష్టం చేశారు.
Similar News
News September 8, 2025
విశాఖ: బీజేపీలో కొత్త జోనల్ ఇన్ఛార్జ్ నియామకం

విశాఖలో BJP రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో కొత్త జోనల్ ఇన్ఛార్జులను ప్రకటించారు. ఉత్తరాంధ్ర జోన్కు మట్టా ప్రసాద్, గోదావరి జోన్కు లక్ష్మీప్రసన్న, కోస్తాంధ్ర జోన్కు నాగోతు రమేష్నాయుడు, రాయలసీమ జోన్కు ఎన్.దయాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ బలోపేతానికి వీరు సమన్వయం చేస్తారని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
News September 8, 2025
హలో వైజాగ్ ఫుడీస్.. మళ్లీ కలుద్దాం..!

విశాఖ ఎంజీఎం గ్రౌండ్స్లో జరుగుతున్న ఫుడ్ ఫెస్టివల్ ఆదివారంతో ముగిసింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ప్రముఖ రెస్టారెంట్స్, హోటల్స్ల ఫుడ్ ఎంజాయ్ చేశారు. సౌత్, నార్త్ తో పాటు విదేశీ రుచులు కూడా అందుబాటులో ఉన్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో వచ్చి బీచ్ వ్యూలో రకరకాల ఫుడ్ని ప్రజలు ఆస్వాదించారు. మరి ఈ ఫుడ్ ఫెస్టివల్లో మీ ఫెవరెట్ ఐటెమ్ ఏదో కామెంట్ చేయండి.
News September 8, 2025
విశాఖ ప్రభుత్వ కార్యాలయాలలో పీజీఆర్ఎస్

విశాఖపట్నం కలెక్టరేట్లో 8వ తేదీ (సోమవారం) ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అదే విధంగా, సీపీ, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.