News August 25, 2025

NRPT: భూముల సమస్యలు కోర్టు పరిధిలో పరిష్కరించుకోవాలి

image

భూములకు సంబంధించిన సమస్యలు కోర్టు పరిధిలో పరిష్కరించుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే లో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను పరిశీలించి చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామని బాధితులకు భరోసా కల్పించారు. మొత్తం 19 అర్జీలు అందించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

Similar News

News August 27, 2025

కామారెడ్డి: వరదలో చిక్కుకున్న 9 మంది సేఫ్

image

ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అన్నసాగర్ శివారులో జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. అయితే వరద ఒక్కసారిగా ముంచెత్తడంతో పనుల్లో భాగంగా అక్కడ బిహారీ కూలీలు వరదలో చిక్కుకున్నారు. ఇది వరకే నలుగురిని కాపాడగా, తాజాగా మరో ఐదుగురిని విపత్తు నిర్వహణ బృందాలు బృందాలు ఒడ్డుకు చేర్చాయి.

News August 27, 2025

MNCL: పోలీస్ కమిషనరేట్‌లో చవితి వేడుకలు

image

రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులతో కలిసి వినాయకుడికి పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.

News August 27, 2025

నారాయణఖేడ్: వాగులను సందర్శించిన ఎస్పీ పారితోష్ పంకజ్

image

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పారితోష్ పంకజ్ సూచించారు. బుధవారం ఆయన నారాయణఖేడ్ మండలంలోని మద్వార్, హనుమంతరావుపేట గ్రామాల్లో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులను పరిశీలించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లోని రహదారులను తాత్కాలికంగా మూసివేయాలని డీఎస్పీ వెంకట్ రెడ్డిని ఆదేశించారు. ఏదైనా ప్రమాదకర పరిస్థితి ఉంటే డయల్ 100కు కాల్ చేసి తెలియజేయాలని ప్రజలకు సూచించారు.