News August 25, 2025
విశాఖలో సెప్టెంబర్ 8 వరకు నేత్రదాన పక్షోత్సవాలు

ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు 40వ జాతీయ నేత్ర దాన పక్షోత్సవాలు జరుగుతాయని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ మీటింగు హాలులో పోస్టర్ను ఆవిష్కరించారు. నేత్రదానంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. డీఎం & హెచ్వో జగదీశ్వరరావు, ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్ ఉన్నారు.
Similar News
News August 27, 2025
GVMC పరిధిలో రూ.1,015 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్లు

GVMC పరిధిలో రూ.1015 కోట్ల అభివృద్ధి పనులకు అక్టోబరులోగా టెండర్లు పిలవాలని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ఆదేశించారు. అమరావతిలో మంగళవారం జీవీఎంసీ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ప్రాజెక్టులకు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలన్నారు.మూడునాలుగేళ్లలో ప్రాజెక్టులు పూర్తి కావాలన్నారు. ప్రజలకు సౌకర్యవంతంగా జోన్ల పునర్వ్యవస్థీకరణ ఉండాలని సూచించారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, అధికారులు పాల్గొన్నారు.
News August 26, 2025
విశాఖలో C.M. పర్యటన ఖరారు

C.M.చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారైంది. 29న సీఎం విశాఖ రానున్నారు. ఉదయం 11.15కి విశాఖ నావెల్ కోస్టల్ బ్యాటరీకి చేరుకుంటారు. 11.45 నుంచి 12.45 వరకు నోవాటెల్లో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్కి హాజరవుతారు. 1.15 నుంచి 3.45 వరకు రాడిసన్ బ్లూ రిసార్ట్లో గ్రిఫిన్ ఫౌండేషన్ నెట్ వర్క్ మీటింగ్లో పాల్గొంటారు. సా. 4.20కి విశాఖ నుంచి బయలుదేరి వెళ్తారు.
News August 26, 2025
డీఎస్సీలో విశాఖ జిల్లా టాపర్గా శ్రావణి

మెగా డీఎస్సీ 2025లో మరడాన శ్రావణి 86 మార్కులతో(ఎస్ఏ) విశాఖ జిల్లా టాపర్గా నిలిచింది. జోన్-1మోడల్ స్కూల్ టీజీటీ ఇంగ్లీష్ 78 మార్కులతో 15వ ర్యాంకు సాధించి రెండు పోస్టులకు ఎంపికయింది. ఈమె ప్రాథమిక, ఉన్నత విద్య శ్రీహరిపురం, కళాశాల విద్య గాజువాకలోను అభ్యసించింది. గతంలో గ్రామ సచివాలయం ఉద్యోగం వచ్చినా వదులుకొని డీఎస్సీకి ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించింది.