News April 2, 2024

శ్రీకాకుళం: REWIND: ద్విసభ్య విధానం అంటే?

image

ఇద్దరేసి సభ్యులు ప్రాతినిధ్యం వహించే వాటిని ద్విసభ్య నియోజకవర్గాలు అంటారు. ఇవి పార్లమెంటుకే కాక, రాష్ట్ర శాసనసభలకూ ఉండేవి. బ్రిటిషు వారు ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ స్వాతంత్రం తరువాత కూడా కొనసాగింది. ఒక నియోజకవర్గం నుంచి ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరు జనరల్, ఎస్సీ-ఎస్టీ వర్గానికి చెందినవారు ఉంటారు. ఈవ్యవస్థలో లోపాలు ఉండటంతో కాంగ్రెస్ 1961లో రద్దు చేసింది. 1952లో పాతపట్నం ద్విసభ్య ఎన్నికలు జరిగాయి.

Similar News

News October 26, 2025

పాతపట్నం: కూతురిపై తండ్రి అఘాయిత్యం.. అబార్షన్ చేయడంతో మృతి

image

పాతపట్నం మండలం సరాళి గ్రామానికి చెందిన పోలాకి అప్పారావు హైదరాబాదులో ఒక అపార్ట్మెంట్ వద్ద వాచ్మెన్‌గా పనిచేస్తున్నాడు. 11 ఏళ్ళ కూతురిపై అఘాయిత్యం చేయడంతో గర్భవతి అయింది. అక్కడ ఉన్నవారికి తెలియకుండా శ్రీకాకుళం తీసుకొచ్చి అబార్షన్ చేయించగా ఆరోగ్యం వికటించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ ఆమె మృతి చెందింది. అక్కడి వైద్యుల సమాచారం మేరకు పాతపట్నం ఎస్సై మధుసూదన రావు శనివారం కేసు నమోదు చేశారు.

News October 26, 2025

RAINS: శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక అధికారిగా చక్రదర్ బాబు

image

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను తీవ్ర వాయుగుండం రూపంలో దూసుకొస్తుంది. ఈ తుఫాను నుంచి జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక అధికారిగా IAS చక్రదర్ బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో జిల్లా JC గా పనిచేసిన అనుభవం ఇతనికుంది.

News October 26, 2025

SKLM: పొట్ట దశలో పైర్లు.. వర్షం పొట్టన పెట్టుకోవద్దని వేడుకోలు!

image

జిల్లా వ్యాప్తంగా అన్నదాతల్లో మొంథా తుఫాన్ రాక గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. నాలుగైదు రోజులు తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన నేపథ్యంలో పంటలపై ఎంతమేర ప్రభావం చూపుతుందో అని ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా పంట వేసిన నుంచి అనేక ఆటుపోట్లు, యూరియా పాట్లు ఎదుర్కొన్న అనంతరం వరి పైరు ప్రస్తుతం పొట్ట దశలో ఉంది. ఇలాంటి సమయంలో ఏ నష్టం జరగొద్దని రైతన్నలు దేవుడికి మొక్కుకుంటున్నారు.