News August 26, 2025

ఇవాళ అర్ధరాత్రి నుంచే US అదనపు టారిఫ్స్

image

భారత్‌పై ట్రంప్ విధించిన అదనపు 25% టారిఫ్స్ ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు US అఫీషియల్ పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేసింది. డెడ్‌లైన్ తర్వాత తమ దేశంలోకి ప్రవేశించే దాదాపు అన్ని రకాల ఇండియన్ గూడ్స్‌కు పెంచిన సుంకాలు వర్తిస్తాయని తెలిపింది. కాగా ఇప్పటికే 25% టారిఫ్స్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇవి 50%కు చేరనున్నాయి. మరోవైపు ఈ అంశంపై PM మోదీ ఆఫీస్‌లో ఇవాళ కీలక మీటింగ్ జరగనుంది.

Similar News

News August 26, 2025

సహస్ర మర్డర్.. క్రిమినల్ కావాలనేదే బాలుడి గోల్!

image

TG: కూకట్‌పల్లి బాలిక <<17485132>>సహస్ర<<>> హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలుడు రాసిన లెటర్‌తో హత్యకు సంబంధం లేదని పోలీసులు తేల్చారు. వేరే ఇంట్లో చోరీ చేయాలని లెటర్ రాసుకున్నాడని తెలిపారు. కాగా పోలీసులు అతడిపై SC, ST కేసు పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. క్రిమినల్ కావాలనేదే బాలుడి గోల్ అని తెలుస్తోంది. మరోవైపు ఉద్దేశపూర్వకంగానే హత్యకు పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

News August 26, 2025

అందుకే ‘మాస్ జాతర’ వాయిదా వేశాం: మేకర్స్

image

మాస్ మహారాజా రవితేజ హీరోగా భాను భోగవరపు తెరకెక్కిస్తోన్న ‘మాస్ జాతర’ సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో సమ్మెతో పాటు మూవీ ప్రొడక్షన్‌లో జాప్యం వల్ల సినిమా రేపు రిలీజ్ చేయలేకపోతున్నామని నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించింది. అతిపెద్ద మాస్ విందును అందించేందుకు తమ బృందం అవిశ్రాంతంగా శ్రమిస్తోందని, త్వరలో కొత్త విడుదల తేదీని వెల్లడిస్తామని తెలిపింది.

News August 26, 2025

IPS అధికారి సంజయ్‌కి రిమాండ్

image

AP: IPS అధికారి సంజయ్‌కి విజయవాడ ఏసీబీ కోర్టు వచ్చే నెల 9 వరకు రిమాండ్ విధించింది. అగ్నిమాపక శాఖలో డీజీగా పనిచేసిన సమయంలో, సీఐడీ చీఫ్‌గా ఉన్నప్పుడు నిధుల మంజూరులో ఆయన అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేయగా సంజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ ముందస్తు బెయిల్ దొరక్కపోవడంతో ఇటీవల ఆయన ఏసీబీ కోర్టులో లొంగిపోయారు.